AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు అస్వస్థత.. మణిపాల్‌ ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స!

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం (ఏప్రిల్ 25) ఉదయం ఆయన తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో, రాజ్‌భవన్ సిబ్బంది వెంటనే ఆయనను విజయవాడలోని తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది.

ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు అస్వస్థత.. మణిపాల్‌ ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స!
Ap Governor Abdul Nazeer
Balaraju Goud
|

Updated on: Apr 25, 2026 | 8:01 AM

Share

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం (ఏప్రిల్ 25) ఉదయం ఆయన తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో, రాజ్‌భవన్ సిబ్బంది వెంటనే ఆయనను విజయవాడలోని తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది. గవర్నర్ ఆరోగ్యంపై ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆయన ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని సమాచారం అందించారు. గ్యాస్ట్రిక్ సమస్య లేదా ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల ఈ నొప్పి వచ్చిందా అన్న కోణంలో వైద్యులు డయాగ్నోస్టిక్ పరీక్షలు చేస్తున్నారు. గవర్నర్ ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలియగానే పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపుతున్నారు. మరిన్ని వివరాల కోసం రాజ్‌భవన్ వర్గాలు అధికారిక బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us