Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వాహనదారులకు ఏపీ ప్రభుత్వం షాక్.. ఆ ధరలు భారీగా పెంపు!

సాధారణంగా వాహనదారులు కొత్త బండి కొనుగోలు చేసినప్పుడు.. దానికి మంచి నెంబర్ రావాలని కోరుకుంటారు. మరికొందరైతే..

Andhra Pradesh: వాహనదారులకు ఏపీ ప్రభుత్వం షాక్.. ఆ ధరలు భారీగా పెంపు!
AP Government
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 10, 2022 | 12:00 PM

సాధారణంగా వాహనదారులు కొత్త బండి కొనుగోలు చేసినప్పుడు.. దానికి మంచి నెంబర్ రావాలని కోరుకుంటారు. మరికొందరైతే వారికి ఇష్టమైన, సెంటిమెంట్ అనుకున్న నెంబర్లను అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేస్తుంటారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన నెంబర్లను ఆర్టీఏనే అధిక ధర నిర్ణయించి బిడ్డింగుకు పిలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఇలా ఫ్యాన్సీ నెంబర్ల కోసం ప్రయత్నిస్తున్న వారికి జగన్ సర్కార్ షాకిచ్చింది. వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును భారీగా పెంచుతూ రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు రూ. 5 వేలు చెల్లించి వేలంలో పాల్గొంటుండగా.. ఆ రుసుమును ఇప్పుడు రూ. 2 లక్షలకు పెంచింది ఏపీ రవాణా శాఖ. ఈ మేరకు మోటారు వాహనాల చట్టానికి సవరణ చేస్తూ గురువారం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రవాణాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకున్న వారు భారీ రుసుము చెల్లించాల్సి ఉండగా.. వాటి నుంచి ప్రభుత్వానికి మాత్రం అధిక ఆదాయం రానున్నట్లు తెలుస్తోంది.