AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP ECET 2023 Results: ఏపీ ఈసెట్-2023 ఫలితాలు వచ్చేశాయ్‌.. మొత్తం ఎంతమంది ఉత్తీర్ణత పొందారంటే..

ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ 2023 ఫలితాలు ఆదివారం (జులై 2) సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి కాకినాడలోని జేఎన్‌టీయూలో ఫలితాలు విడుదల చేశారు...

AP ECET 2023 Results: ఏపీ ఈసెట్-2023 ఫలితాలు వచ్చేశాయ్‌.. మొత్తం ఎంతమంది ఉత్తీర్ణత పొందారంటే..
AP ECET 2023 Results
Srilakshmi C
|

Updated on: Jul 02, 2023 | 6:01 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ 2023 ఫలితాలు ఆదివారం (జులై 2) సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి కాకినాడలోని జేఎన్‌టీయూలో ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో  చెక్‌ చేసుకోవచ్చు. మొత్తం 92.55 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 38,181మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 34,503 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో బాలురు 25,902 మంది, బాలికలు 8,601 మంది ఉన్నారు.

కాగా ఈసెట్‌ పరీక్ష జూన్‌ 20న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రోజు విడుదలైన ఫలితాల్లో 31,933 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. వారిలో 23,748 మంది బాలురు, 8,185 బాలికలు అర్హత సాధించినట్టు అధికారులు తెలిపారు. ఈసెట్‌ ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ , బీఎస్సీ (మ్యాథ్స్‌) పూర్తిచేసిన విద్యార్థులకు నేరుగా బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.