ఏపీలో కాస్త పెరిగిన పాజిటివ్ కేసులు, తగ్గిన మరణాలు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే!
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,461 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో...
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,461 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 19,85,182 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 18,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 2113 మంది వైరస్ నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 19,52,736కి చేరింది. అలాగే తాజాగా వైరస్ కారణంగా 15 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 13,564కి చేరింది.
మరోవైపు నిన్న జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం 28, చిత్తూరు 195, తూర్పుగోదావరి 98, గుంటూరు182, కడప 59, కృష్ణ 210, కర్నూలు 12, నెల్లూరు 195, ప్రకాశం 112, శ్రీకాకుళం 41, విశాఖపట్నం 74, విజయనగరం 20, పశ్చిమ గోదావరి 235 కేసులు నమోదయ్యాయి.
Also Read:
సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!
బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!
#COVIDUpdates: 10/08/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,82,287 పాజిటివ్ కేసు లకు గాను *19,49,841 మంది డిశ్చార్జ్ కాగా *13,564 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,882#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/69gwfMzJNP
— ArogyaAndhra (@ArogyaAndhra) August 10, 2021