AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పు.. ఒక్క రోజు ముందుగానే హస్తినకు.!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. వాస్తవానికి ముఖ్యమంత్రి ఈ నెల 6న ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా.. అక్టోబర్ 5వ తేదీ ఉదయమే హస్తినకు బయల్దేరనున్నారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత ఢిల్లీ వెళ్తుండటంతో జగన్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ స్టోరీ సంగతి ఏంటి ఇప్పుడు తెలుసుకుందామా..

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పు.. ఒక్క రోజు ముందుగానే హస్తినకు.!
YS Jagan
Ravi Kiran
|

Updated on: Oct 04, 2023 | 9:00 PM

Share

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. వాస్తవానికి ముఖ్యమంత్రి ఈ నెల 6న ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా.. అక్టోబర్ 5వ తేదీ ఉదయమే హస్తినకు బయల్దేరనున్నారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత ఢిల్లీ వెళ్తుండటంతో జగన్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ స్టోరీ ఏంటి ఇప్పుడు తెలుసుకుందామా..

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. హస్తినలో రెండు రోజులపాటు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా.. ఏపీలోని తాజా పరిణామాలతోపాటు.. విభజన హామీలను ప్రస్తావించే అవకాశం ఉంది. వామపక్ష తీవ్రవాదంపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్‌ హాజరు కానున్నారు. అలాగే.. పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలవనున్నారు. ఇక.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్తుండటంతో జగన్‌ పర్యటన ఆసక్తిగా మారుతోంది.

వాస్తవానికి.. గత నెల 12న లండన్‌ యాత్ర ముగించుకుని వచ్చిన వెంటనే సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే.. ప్రధాని అందుబాటులో లేకపోవడంతో పర్యటన వాయిదా పడింది. దాంతోపాటు.. గత నెల 21 నుంచి 27 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత వరుస సెలవులు రాగా.. రేపు, ఎల్లుండి ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రి అమిత్‌ షా కూడా ఢిల్లీలోనే అందుబాటులో ఉంటారనే సమాచారంతో హస్తినకు పయనమవుతున్నారు సీఎం జగన్‌. ఇదిలావుంటే.. రేపు కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ హాజరు కావాల్సి ఉన్నా ఢిల్లీ పర్యటనతో వాయిదా పడింది. మొత్తంగా.. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌ ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..