AP News: టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాష్ట్ర సచివాలయంలో పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా విభాగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని.. కోర్సుల ఫోర్ క్యాస్టింగ్ జరగాలని సీఎం ఈ సమావేశంలో సూచించారు..

AP News: టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu review Meeting

Updated on: May 01, 2026 | 6:13 AM

అమరావతి, మే 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా విభాగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని.. కోర్సుల ఫోర్ క్యాస్టింగ్ జరగాలని సీఎం ఈ సమావేశంలో సూచించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల రీస్ట్రక్చరింగ్ జరగాలని దిశానిర్దేశం చేశారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్ లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థ మార్పులు అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. క్వాంటం టెక్నాలజీపై కోర్సును ప్రారంభించిన ఆంధ్రా యూనివర్సిటీని ఆయన అభినందించారు. ప్రపంచ స్థాయీ వర్శిటీలతో ఏపీ విశ్వవిద్యాలయాలు పోటీ పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

కాగా ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఎక్స్ వేదికగా ఫ‌లితాలు పోస్ట్ చేశారు. మొత్తం ఫలితాల్లో 85.25 శాతం మంది ఉత్తీర్ణ‌త‌ పొందారు. ఇందులో బాలురు 82.68 శాతం ఉత్తీర్ణ‌త‌ పొందగా, బాలిక‌లు 87.90 శాతం చొప్పున ఉత్తీర్ణ‌త‌ సాధించారు. ఈసారి బాలురు కంటే బాలిక‌ల ఉత్తీర్ణ‌త శాతం 5.22 శాతం ఎక్కువగా నమోదైంది. ఈ ఏడాది 12,089 పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న మొత్తం 6,18,131 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు. అత్య‌ధికంగా పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాల్లో 96.07 శాతం ఉత్తీర్ణ‌త‌ నమోదైంది. అత్య‌ల్పం అల్లూరు సీతారామ‌రాజు జిల్లా 57.02 శాతం ఉత్తీర్ణ‌త‌ నమోదైంది. రాష్ట్రంలో 2161 పాఠ‌శాలల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త‌ నమోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us