Andhra Pradesh: పొలంలో పశువులు మృతి.. దాని పనే అంటున్న గ్రామస్తులు..!

|

Jan 29, 2022 | 5:08 PM

Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో పులి భయం వణికిస్తోంది. గుణ్ణంపల్లి గ్రామ పరిసరాల్లో తిరుగుతోన్న పులి..

Andhra Pradesh: పొలంలో పశువులు మృతి.. దాని పనే అంటున్న గ్రామస్తులు..!
Follow us on

Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో పులి భయం వణికిస్తోంది. గుణ్ణంపల్లి గ్రామ పరిసరాల్లో తిరుగుతోన్న పులి… రెండు దూడలపై దాడి చేసి తినేసింది. పులి పాదముద్రలను గుర్తించి ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు గ్రామస్తులు. మూడ్రోజులుగా అమ్మో పులి అంటూ ఆ ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో రెండు దూడలు మృత్యువాత పడ్డాయి.

ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లికి చెందిన ఓ రైతు పొలంలో ఒక దూడను గుర్తు తెలియని జంతువు చంపేసింది. మరుసటి రోజు ఉదయం రైతు పొలానికి వెళ్లి దూడ కళేబరాన్ని, ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు పోలి ఉన్న జాడలను గుర్తించాడు. అటు, సమీపంలోని నారాయణపురం శివారు పొలంలో మరో దూడను గుర్తు తెలియని జంతువు చంపేసింది. దీంతో రైతులు ఆ ప్రాంతంలో పులిని పోలిన జంతువు ఏదో తిరుగుతుందని, దాని పాదముద్రలను గుర్తించారు. పులి భయంతో ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లలేక, తమ పశువులను కాపాడుకోలేక ఆందోళన చెందుతున్నారు.

Also read:

Raviteja: మాస్ రాజా సినిమాలో కీలక పాత్రలో ఆ హీరోయిన్.. చాలా కాలం తర్వాత వెండితెర పైకి..

Crabs: పీత రక్తం లీటర్ రూ.12 లక్షలు.. అంత ధర ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

IIT Delhi Jobs: ఐఐటీ – ఢిల్లీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలివే!