Andhra Pradesh: ఫస్ట్‌నైట్ రోజున వెధవ పని చేసిన భర్త.. ఛీకొట్టి పోలీసులను ఆశ్రయించిన భార్య..

|

Mar 02, 2023 | 7:48 AM

పెళ్లంటే.. నేరేళ్ల పంట అంటారు పెద్దలు. ఆ బంధం మరింత బలపడే ముహూర్తం.. ఫస్ట్ నైట్. పెళ్లి తరువాత తొలిరోజున భార్యభర్తల కలయిక.. వారిద్దరి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

Andhra Pradesh: ఫస్ట్‌నైట్ రోజున వెధవ పని చేసిన భర్త.. ఛీకొట్టి పోలీసులను ఆశ్రయించిన భార్య..
First Night
Follow us on

పెళ్లంటే.. నేరేళ్ల పంట అంటారు పెద్దలు. ఆ బంధం మరింత బలపడే ముహూర్తం.. ఫస్ట్ నైట్. పెళ్లి తరువాత తొలిరోజున భార్యభర్తల కలయిక.. వారిద్దరి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భార్యభర్తలిద్దరి వ్యక్తిగత అంశమైన ఈ కార్యాన్ని.. ఓ నికృష్టపు భర్త ప్రజలందరికీ తెలిసేలా చేశాడు. అది తెలిసిన భార్య.. ఛీకొట్టి పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రుల సహాయంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఆ భర్త ఏం చేశాడు.. ఏం జరిగింది? వివరాలు తెలుసుకుందాం..

ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ తీరగ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 8న సదరు గ్రామానికి చెందిన యువకుడు(20), బాలిక(17) వివాహం జరిగింది. అయితే, తొలిరాత్రి భార్యభర్తలిద్దరూ ఏకాంతంగా గడిపిన సమయాన్ని తన ఫోన్‌లో చిత్రీకరించాడు. మరుసటి రోజు.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అవికాస్తా అందరికీ చేరడంతో కలకలం రేగింది.

విషయం తెలుసుకున్న బాలిక.. తన తల్లిదండ్రులకు చెప్పింది. విషయం ఊరంతా పాకడంతో.. యువకుడి బంధువులు గ్రామపెద్దల అండతో కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే, బాలిక తన తల్లిదండ్రుల సాయంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..