At Home: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తేనీటి విందు.. ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమానికి సీఎం జగన్, చంద్రబాబు..

|

Aug 15, 2022 | 5:48 PM

ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇచ్చే ఎట్‌ హోమ్‌ కార్యక్రమం దీనికి వేదిక కాబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు..

At Home: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తేనీటి విందు.. ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి సీఎం జగన్, చంద్రబాబు..
Andhra Pradesh
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకోబోతోంది. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇచ్చే ఎట్‌ హోమ్‌ కార్యక్రమం దీనికి వేదిక కాబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరువుతున్నారు. ఈ ఇద్దరు ఇటీవల ఎదురుపడటం ఇదే మొదటిసారి.

ఇద్దరూ మాట్లాడుకుంటారా, కనీసం పలకరించుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. సాయంత్రం ఐదున్నర గంటలకు ఎట్‌ హోమ్‌ మొదలుకానుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం