ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకోబోతోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇచ్చే ఎట్ హోమ్ కార్యక్రమం దీనికి వేదిక కాబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరువుతున్నారు. ఈ ఇద్దరు ఇటీవల ఎదురుపడటం ఇదే మొదటిసారి.
ఇద్దరూ మాట్లాడుకుంటారా, కనీసం పలకరించుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. సాయంత్రం ఐదున్నర గంటలకు ఎట్ హోమ్ మొదలుకానుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజ్భవన్కు చేరుకున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం