Andhra Pradesh: ఓవర్‌ టు ఢిల్లీ.. జీవో1పై హైకోర్టు స్టేను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు సర్కార్

ఓవర్‌ టు ఢిల్లీ. జీవో వన్‌ ఇష్యూ హస్తినకు చేరింది. హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ఆ జీవోపై రాజకీయంగా మాటల యుద్ధం కొనసాగుతోంది.

Andhra Pradesh:  ఓవర్‌ టు ఢిల్లీ.. జీవో1పై హైకోర్టు స్టేను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు సర్కార్
AP Cm Ys Jagan Mohan Reddy
Follow us

|

Updated on: Jan 17, 2023 | 6:50 PM

రోడ్లపై బహిరంగ సభల్ని నిషేధిస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్‌ వన్‌ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ ప్రభుత్వం. ఇటీవల ఆ జీవో అమలుపై స్టే విధించింది హైకోర్టు. ఈ నెల 23వ తేదీ వరకు స్టే అమలులో ఉంటుంది ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది రాష్ట్రం. ఇటీవలి పరిణామాలు, జరిగిన దుర్ఘటనలను వివరిస్తూ రోడ్లపై బహిరంగ సభల్ని మాత్రమే నిషేధిస్తూ జీవో తెచ్చామని, హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలని పిటిషన్‌ వేసింది. దీనిపై అత్యున్నత ధర్మాసనంలో విచారణ జరగాల్సి ఉంది.

మరోవైపు ప్రతిపక్షాల సభలకు వస్తున్న జనాదరణ చూసి భయపడే ప్రభుత్వం జీవో వన్‌ తెచ్చిందని విమర్శించింది టీడీపీ. అయినా సరే లోకేష్‌ పాదయాత్ర ఆగబోదన్నారు సీనియర్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌.  టీడీపీ విమర్శల్ని ఖండిస్తోంది వైసీపీ. రోడ్‌షోలను, పాదయాత్రలను ఎక్కడా అడ్డుకోలేదన్నారు మంత్రి అమర్‌నాధ్‌. కేవలం రోడ్లపై సభలు మాత్రమే వద్దన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్స్‌ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.