AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Disha Act: మహిళల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడొద్దు.. దిశ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన దిశ చట్టం ఆమోదించాలంటూ లేఖ ద్వారా కోరారు.

AP Disha Act: మహిళల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడొద్దు.. దిశ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష
Ap Cm Ys Jagan Review On Disha Act
Balaraju Goud
|

Updated on: Jul 02, 2021 | 5:08 PM

Share

AP CM YS Jagan Review on Disha Act: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన దిశ చట్టం ఆమోదించాలంటూ శుక్రవారం సీఎం జగన్‌ లేఖ ద్వారా స్మృతి ఇరానీని కోరారు. దిశ బిల్లు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, ‘దిశ’ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమీక్షలో భాగంగా దిశ చట్టానికి సంబంధించి కేంద్ర మంత్రికి జగన్‌ లేఖ రాశారు. కాగా ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Cm Ys Jagan Letter To Uion Minister Smriti Irani

Cm Ys Jagan Letter To Uion Minister Smriti Irani

అలాగే, దిశ కాల్‌సెంటర్లలో అదనపు సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మహిళల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడొద్దన్న ఆయన.. దిశ పెట్రోలింగ్ కోసం కొత్తగా 145 వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 6 కొత్త దిశ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు త్వరగా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి, విశాఖలో ల్యాబ్‌ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలన్నారు. ఇక ఫొరెన్సిక్ ల్యాబ్‌ల్లో ఇప్పటికే 58 పోస్టుల భర్తీకాగా… మరో 61 పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు.

ఇక, కేసుల దర్యాప్తు విషయంలో అలసత్వం వద్దన్న సీఎం.. ప్రభుత్వం, పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్న ఘటనల్లో.. నిజాలను ప్రజల ముందుంచాలన్నారు. బాధితులను ఆదుకునే విషయంలో ఆలస్యం జరగకూడదని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో… ప్రీతి సుగాలి కుటుంబాన్ని ఆదుకునే విషయంలో… తీసుకునే చర్యలను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ‘‘ప్రీతి సుగాలి తండ్రికి ఉద్యోగం ఇస్తున్నామని. ప్రీతి తల్లి కోరుకున్నట్లే ఆమెను కర్నూలు డిస్పెన్సరీలోనే కొనసాగిస్తున్నాం. 5 సెంట్ల ఇంటి పట్టా, ఐదెకరాల భూమిని కూడా ఇస్తున్నాం’’ అని ముఖ్యమంత్రికి తెలిపారు.

Read Also….  Indian Woman fly into space: అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. స్పేస్ ఫ్లేస్ సంపాదించిన గుంటూరు యువతి