Andhra Pradesh: ఆ సమస్యపై దత్తపుత్రుడు అప్పుడెందుకు మాట్లాడలేదు.. సీఎం జగన్ సూటి ప్రశ్న

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు పరామర్శ అంటూ రైతుల వద్దకు వెళ్లిన చంద్రబాబు నాయుడి...

Andhra Pradesh: ఆ సమస్యపై దత్తపుత్రుడు అప్పుడెందుకు మాట్లాడలేదు.. సీఎం జగన్ సూటి ప్రశ్న
Cm Jagan
Follow us

|

Updated on: May 16, 2022 | 1:13 PM

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు పరామర్శ అంటూ రైతుల వద్దకు వెళ్లిన చంద్రబాబు నాయుడి దత్తపుత్రుడు.. పరిహారం అందని ఒక్క రైతునూ చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అంటే విపరీతమైన ప్రేమ చూపించే దత్తపుత్రుడు ప్రశ్నించాల్సిన సమయంలో ఎందుకు అడగలేదని నిలదీశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు రైతుల కష్టాలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గతంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్న చంద్రబాబు మాటలపై ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా గణపవరం లో వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. రైతులకు వడ్డీలేని రుణాల పథకం కింద రూ.1,282 కోట్లు అందజేశామన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు రూ.7లక్షల ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Lotus Benefits: బురదలో వికసించే తామరపువ్వుతో మైండ్ బ్లాంక్ అయ్యే బెనిఫిట్స్.. కనీసం మీరు ఊహించలేరు

Divi Vadthya: సంద్రంలో తడిసిన అందాలను ఆరబోస్తున్న జలకన్యలా మెరిసిపోతున్న ‘దివి ‘..