Andhra Pradesh: మహిళపై ఆటో డ్రైవర్ దాష్టీకం.. ఇచ్చిన బాకీ అడిగినందుకు దారుణానికి ఒడిగట్టారు..

| Edited By: Ram Naramaneni

Aug 06, 2021 | 7:31 PM

Andhra Pradesh: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఓ ఆటో డ్రైవర్.. మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఇచ్చిన బాకీని చెల్లించమని..

Andhra Pradesh: మహిళపై ఆటో డ్రైవర్ దాష్టీకం.. ఇచ్చిన బాకీ అడిగినందుకు దారుణానికి ఒడిగట్టారు..
Auto Driver
Follow us on

Andhra Pradesh: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఓ ఆటో డ్రైవర్.. మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఇచ్చిన బాకీని చెల్లించమని అడిగినందుకు.. కాలితో ఎగిరి తన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ ప్రస్తుతం విజయవాడ రాణిగారి తోటలో నివాసం ఉంటోంది. అయితే, మహానాడులో ఉండగా తాపీ మేస్త్రీగా పని చేసే చిర్రావురికి చెందిన గోపీ కృష్ణ అనే యువకుడికి రూ. 3 లక్షల నగదు వడ్డీకి ఇప్పించింది. అప్పటి నుంచి అప్పు తీర్చమని అడుగుతున్నా.. గోపీ కృష్ణ పట్టించుకోవడం లేదు. దాంతో ఇక లాభం లేదనుకున్న మహిళ.. చిర్రావురుకు వచ్చి తీసుకున్న బాకీ తీర్చమని గోపీ కృష్ణను అడిగింది.

అయితే, గోపీ కృష్ణ.. ఆ మహిళను తన ఆటోలో జనంసచారం లేని కృష్ణ కరకట్ట వద్దకు తీసుకువచ్చాడు. అక్కడ డబ్బుల గురించి అడగ్గా.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కృష్ణ.. కాలితో ఎగిరి తన్నటంతో.. మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ వ్యవహారాన్నంతా మహిళతో వచ్చిన మరొకరు వీడియో తీశారు. కాగా, కృష్ణ తీరుపై 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహిళను చికిత్స నిమిత్తం మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటన చిర్రావూరు, రామచంద్రపురం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Prakasham: హిజ్రాతో సహజీవనం చేస్తూ మరో పెళ్లికి సిద్ధపడ్డ ఆర్మీ ఉద్యోగి.. విషయం తెలిసిన యువతి ఏం చేసిందంటే..

Viral Video: అమ్మాయిలా మజాకా.. ఆ స్టైల్ ఏంటీ.. ఆ బైక్ తోలుడేంది.. దుమ్ము లేపారంతే…

Andhra Pradesh: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫరీక్షలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్.. పూర్తి వివరాలు మీకోసం..