AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీ ఎమ్మెల్యేలపై మిస్సింగ్ కేసు

తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నిడమర్రు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను చెప్పాలనుకుంటే ఆయన కనిపించడం లేదని.. ఇల్లు, కార్యాలయం వెతికినా ఫలితం లేదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకొని తమ ఎమ్మెల్యేను అప్పగించాలంటూ వారు కోరారు. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మంత్రుల మాటలతో అమరావతి ప్రాంత ప్రజల్లో ఆందోళన […]

వైసీపీ ఎమ్మెల్యేలపై మిస్సింగ్ కేసు
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 24, 2019 | 1:06 PM

Share

తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నిడమర్రు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను చెప్పాలనుకుంటే ఆయన కనిపించడం లేదని.. ఇల్లు, కార్యాలయం వెతికినా ఫలితం లేదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకొని తమ ఎమ్మెల్యేను అప్పగించాలంటూ వారు కోరారు.

అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మంత్రుల మాటలతో అమరావతి ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. రాజధానిని మార్చి తమ పొట్ట కొట్టకండి అంటూ వారు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. భారీ సంఖ్యలో అమరావతి ప్రాంతానికి చేరుకుంటున్న రైతులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మూడు రాజధానులను ప్రకటించక ముందు అమరావతి ప్రాంత ప్రజలకు భరోసా ఇస్తూ వస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. రాజధాని పనులు ఇక్కడ కొనసాగుతాయని.. భూముల గురించి ఎలాంటి దిగులు చెందొద్దని ఆయన అన్నారు. అంతేకాదు పూలింగ్ ప్రక్రియలో రైతుల నుంచి తీసుకున్న భూములకు తమ ప్రభుత్వం మంచి రేటును ఇస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చినప్పటి నుంచి ఆర్కే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి తోడు అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదు. దీంతో నిడుమర్రు రైతులు పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి సైతం రాజధాని సెగలు తగులుకున్నాయి. ‘‘మా ఎమ్మెల్యే కనిపించడం లేదు. కాస్త వెతికి పెట్టండి’’ అంటూ మహిళలు తాజాగా ఫిర్యాదు చేశారు. కాగా రాజధాని ప్రకటన తరువాత వీరిద్దరి అయోమయంలో పడ్డట్లు తెలుస్తోంది.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే