AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీ ఎమ్మెల్యేలపై మిస్సింగ్ కేసు

తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నిడమర్రు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను చెప్పాలనుకుంటే ఆయన కనిపించడం లేదని.. ఇల్లు, కార్యాలయం వెతికినా ఫలితం లేదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకొని తమ ఎమ్మెల్యేను అప్పగించాలంటూ వారు కోరారు. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మంత్రుల మాటలతో అమరావతి ప్రాంత ప్రజల్లో ఆందోళన […]

వైసీపీ ఎమ్మెల్యేలపై మిస్సింగ్ కేసు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 24, 2019 | 1:06 PM

Share

తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నిడమర్రు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను చెప్పాలనుకుంటే ఆయన కనిపించడం లేదని.. ఇల్లు, కార్యాలయం వెతికినా ఫలితం లేదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకొని తమ ఎమ్మెల్యేను అప్పగించాలంటూ వారు కోరారు.

అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మంత్రుల మాటలతో అమరావతి ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. రాజధానిని మార్చి తమ పొట్ట కొట్టకండి అంటూ వారు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. భారీ సంఖ్యలో అమరావతి ప్రాంతానికి చేరుకుంటున్న రైతులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మూడు రాజధానులను ప్రకటించక ముందు అమరావతి ప్రాంత ప్రజలకు భరోసా ఇస్తూ వస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. రాజధాని పనులు ఇక్కడ కొనసాగుతాయని.. భూముల గురించి ఎలాంటి దిగులు చెందొద్దని ఆయన అన్నారు. అంతేకాదు పూలింగ్ ప్రక్రియలో రైతుల నుంచి తీసుకున్న భూములకు తమ ప్రభుత్వం మంచి రేటును ఇస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చినప్పటి నుంచి ఆర్కే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి తోడు అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదు. దీంతో నిడుమర్రు రైతులు పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి సైతం రాజధాని సెగలు తగులుకున్నాయి. ‘‘మా ఎమ్మెల్యే కనిపించడం లేదు. కాస్త వెతికి పెట్టండి’’ అంటూ మహిళలు తాజాగా ఫిర్యాదు చేశారు. కాగా రాజధాని ప్రకటన తరువాత వీరిద్దరి అయోమయంలో పడ్డట్లు తెలుస్తోంది.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు