AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కనబడుట లేదు: బాబుపై మిస్సింగ్ కేసు

మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కనిపించడం లేదంటూ వైసీపీ నేతలు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన కుప్పం వైసీపీ నేతలు.. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సమస్యలు విన్నవించుకుందామని వెళితే.. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని వారు అంటున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత ఒకసారి మాత్రమే పర్యటించి.. పార్టీ నాయకులను ఓదార్చిన బాబు తరువాత కనిపించడం లేదని, ఆయన ఆచూకీ […]

కనబడుట లేదు: బాబుపై మిస్సింగ్ కేసు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 24, 2019 | 2:11 PM

Share

మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కనిపించడం లేదంటూ వైసీపీ నేతలు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన కుప్పం వైసీపీ నేతలు.. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సమస్యలు విన్నవించుకుందామని వెళితే.. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని వారు అంటున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత ఒకసారి మాత్రమే పర్యటించి.. పార్టీ నాయకులను ఓదార్చిన బాబు తరువాత కనిపించడం లేదని, ఆయన ఆచూకీ తెలిస్తే తమకు చెప్పాలంటూ వారు ఆ ఫిర్యాదులో వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఏపీలో రాజధాని సెగలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంత ప్రజలు ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన  శ్రీదేవీలు కనిపించడం లేదంటూ రైతుల, మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో  వైసీపీ నేతలు, చంద్రబాబు కనిపించడం లేదంటూ కుప్పంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనర్హం.