AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రెవెన్యూ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలు, అవి దుర్వినియోగం అయిన తీరుపై అధికారులతో చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపైనా సమీక్షించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు.

Chandrababu: పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Chandrababu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 29, 2024 | 8:07 PM

రెవెన్యూ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలు, అవి దుర్వినియోగం అయిన తీరుపై అధికారులతో చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపైనా సమీక్షించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. ల్యాండ్ గ్రాబింగ్​ను అరికట్టడానికి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా.. ఉంటే ఎలాంటి కొత్త చట్టాలు తేవాలి?.. అనే అంశంపైనా అధికారులను ఆరా తీశారు. మరోవైపు… పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించిన చంద్రబాబు.. భూ యజమానులకిచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమాల ఆరోపణలపై, గత ఐదేళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలపై సమీక్ష నిర్వహించారు. పెరిగిన భూ వివాదాలను పరిష్కరించడంపైనా చంద్రబాబు పలు సూచనలు చేశారు.

గత పాలనలో 22Aలో పెట్టిన భూములెన్ని? లాభపడింది ఎవరు? అక్రమంగా జరిగిన భూలావాదేవీలెన్ని? నష్టపోయింది ఎంత?, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎన్ని ఎకరాలు వెళ్లాయి? పూర్తి డేటాతో వచ్చేవారంతో మరోసారి సమీక్షకు రావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భూసర్వే పేరుతో రాష్ట్రంలో 77లక్షల రాళ్లు పాతారని చెప్పిన అధికారులు వివరణ ఇచ్చారు.. విశాఖ, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరుల్లో అత్యధికంగా భూములపై ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై వచ్చేవారంలోగా పూర్తి డేటా కావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఏపీలో త్వరలో కొత్తగా ల్యాండ్‌ పాస్‌బుక్‌ల పంపిణీ చేపట్టనున్నారు. పాస్‌బుక్‌లలో కొత్తగా క్యూఆర్‌ కోడ్‌ల ముద్రణ, యజమాని వివరాలతో పాటు క్యూఆర్‌ కోడ్‌లో రూట్‌మ్యాప్‌ కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 20కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త పాస్‌‌బుక్‌ల రూపకల్పన చేయనున్నారు.

కాగా.. మదనపల్లి ఫైర్‌ ఫైల్స్‌పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. అధికారుల దర్యాప్తులో తేలిన అంశాలపై ఆరా తీశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఇద్దరు ఆర్డీఓలు, ఒక సీనియర్ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌ విధించారు. ఫైల్స్ దగ్దం వెనుక ఉన్న పెద్దతలకాయాలపైనా దర్యాప్తునకు ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..