Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దారుణ హత్య.. బైక్ పై వస్తుండగా కాపు కాచి.. కత్తులు, కర్రలతో దాడి..

మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొచ్చెరువు గ్రామానికి చెందిన లద్దగిరి శీనును.. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లి వద్ద కాపుకాచి హత్య చేశారు. బైక్ పై వస్తుండగా ప్రత్యర్థులు...

Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దారుణ హత్య.. బైక్ పై వస్తుండగా కాపు కాచి.. కత్తులు, కర్రలతో దాడి..
Representative Image
Follow us

|

Updated on: Feb 08, 2023 | 6:06 PM

మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొచ్చెరువు గ్రామానికి చెందిన లద్దగిరి శీనును.. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లి వద్ద కాపుకాచి హత్య చేశారు. బైక్ పై వస్తుండగా ప్రత్యర్థులు కాపు కాసి కత్తులతో నరికి, కర్రలతో కొట్టి చంపారు. డోన్ నియోజకవర్గంలో అందరూ పార్టీ మారినప్పటికీ శీను మారలేదు. ఇతను మైనింగ్ నిర్వహిస్తున్నాడు. అయితే కొంతకాలంగా మైనింగ్ యజమానుల పైన నిర్వాహకుల పైన ఫిర్యాదులు చేసినట్లుగా స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈరోజు కూడా చంద్రపల్లి బావిపల్లి దగ్గర తన సుద్ధ మైనింగ్ కార్యకలాపాలు చుసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దారుణ హత్యపై పలువురు మైనింగ్ యజమానులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులు, కర్రలను అక్కడే వదిలేసి వెళ్లారు. జలదుర్గం పోలీసులు హత్యాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. హత్య జరిగన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా.. కొన్ని రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అధికార వైసీపీపై ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని, ఇది పోవాలంటే సైకిల్‌ అధికారంలోకి రావాలని అన్నారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ కేవలం వైసీపీ కార్యకర్తలకు పథకాలను అందిస్తూ మిగిలిన వారికి మొండి చేయి చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారం కోల్పోతుందా.. అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

యువగళం పేరుతో టీడీపీ లీడర్ నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్నందున వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన విశ్వవిఖ్యాత, నటసార్వభౌముడు ఎన్‌టి.రామారావు అని కొనియాడారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన నాయకుడు చంద్రబాబు అని గుర్తు చేశారు. ఆ రాష్ట్ర నేడు రాజకీయ ఉన్మాది చేతిలో నలిగిపోతోందని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మె్ల్యే కోట్ల సుజాతమ్మ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..