AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దారుణ హత్య.. బైక్ పై వస్తుండగా కాపు కాచి.. కత్తులు, కర్రలతో దాడి..

మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొచ్చెరువు గ్రామానికి చెందిన లద్దగిరి శీనును.. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లి వద్ద కాపుకాచి హత్య చేశారు. బైక్ పై వస్తుండగా ప్రత్యర్థులు...

Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దారుణ హత్య.. బైక్ పై వస్తుండగా కాపు కాచి.. కత్తులు, కర్రలతో దాడి..
Representative Image
Ganesh Mudavath
|

Updated on: Feb 08, 2023 | 6:06 PM

Share

మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొచ్చెరువు గ్రామానికి చెందిన లద్దగిరి శీనును.. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లి వద్ద కాపుకాచి హత్య చేశారు. బైక్ పై వస్తుండగా ప్రత్యర్థులు కాపు కాసి కత్తులతో నరికి, కర్రలతో కొట్టి చంపారు. డోన్ నియోజకవర్గంలో అందరూ పార్టీ మారినప్పటికీ శీను మారలేదు. ఇతను మైనింగ్ నిర్వహిస్తున్నాడు. అయితే కొంతకాలంగా మైనింగ్ యజమానుల పైన నిర్వాహకుల పైన ఫిర్యాదులు చేసినట్లుగా స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈరోజు కూడా చంద్రపల్లి బావిపల్లి దగ్గర తన సుద్ధ మైనింగ్ కార్యకలాపాలు చుసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దారుణ హత్యపై పలువురు మైనింగ్ యజమానులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులు, కర్రలను అక్కడే వదిలేసి వెళ్లారు. జలదుర్గం పోలీసులు హత్యాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. హత్య జరిగన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా.. కొన్ని రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అధికార వైసీపీపై ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని, ఇది పోవాలంటే సైకిల్‌ అధికారంలోకి రావాలని అన్నారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ కేవలం వైసీపీ కార్యకర్తలకు పథకాలను అందిస్తూ మిగిలిన వారికి మొండి చేయి చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారం కోల్పోతుందా.. అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

యువగళం పేరుతో టీడీపీ లీడర్ నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్నందున వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన విశ్వవిఖ్యాత, నటసార్వభౌముడు ఎన్‌టి.రామారావు అని కొనియాడారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన నాయకుడు చంద్రబాబు అని గుర్తు చేశారు. ఆ రాష్ట్ర నేడు రాజకీయ ఉన్మాది చేతిలో నలిగిపోతోందని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మె్ల్యే కోట్ల సుజాతమ్మ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!