US Israel Iran War Live: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం

US Israel attack Iran Live Updates : ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌, అమెరికా బలగాలు ఇరాన్‌పై మిసైల్ దాడులు చేశాయి. కౌంటర్‌గా ఇరాన్ 70 క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించగా, ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ మధ్యప్రాచ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్న భారత పౌరులకు కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచించింది.

US Israel Iran War Live: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
Middle East Conflict Iran Israel War

Updated on: Feb 28, 2026 | 6:02 PM

LIVE NEWS & UPDATES

  • 28 Feb 2026 06:05 PM (IST)

    గల్ఫ్ యుద్ధంతో మళ్లీ భగ్గుమంటున్న బంగారం, వెండి

    ఒక్క రోజే రూ.7 వేలు పెరిగిన 10 గ్రాముల బంగారం

    24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,68,710

    రూ.6,550 పెరిగిన 22 క్యారెట్ల గోల్డ్ రేట్

    రూ.1,54,650కు చేరిన 22 క్యారెట్ల బంగారం ధర

    ఒక్కరోజే రూ. 25 వేలు పెరిగిన కిలో వెండి ధర

    మరోసారి రూ.3 లక్షల మార్క్ దాటేసిన వెండి

    ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి రూ.3,20,000

  • 28 Feb 2026 05:54 PM (IST)

    కువైట్‌లోని భారతీయులకు ఇండియన్‌ ఎంబసీ కీలక సూచనలు

    భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

    స్థానిక భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాలని సూచన

    కువైట్‌ ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలను ఫాలో అవ్వాలని సూచన

    ఇండియన్‌ ఎంబసీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం

  • 28 Feb 2026 05:00 PM (IST)

    ఇరాన్‌పై యుఎస్-ఇజ్రాయెల్ దాడులను ఖండించిన పాకిస్థాన్

    ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను పాకిస్తాన్ ఖండించింది. తక్షణమే ఉద్రిక్తత తగ్గించాలని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాక పిలుపునిచ్చింది. శనివారం తన ఇరానియన్ సహచరుడితో జరిగిన ఫోన్ సంభాషణలో, ఇస్లామాబాద్ “ఇరాన్‌పై జరిగిన అనవసర దాడులను బలంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. పాకిస్తాన్ తక్షణమే ఉద్రిక్తతను ఆపి, అత్యవసరంగా దౌత్య సంబంధాలను పునఃప్రారంభించాలని పిలుపునిచ్చింది.

  • 28 Feb 2026 04:51 PM (IST)

    ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడులు.. 36 మంది విద్యార్థులు మృతి

    ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడులు

    మినాబ్‌లోని ఓ స్కూల్‌పై బాంబుల వర్షం

    దాడిలో 36 మంది స్కూల్ విద్యార్థినులు మృతి

  • 28 Feb 2026 04:40 PM (IST)

    ఇజ్రాయెల్, అమెరికా దాడి.. ఇరాన్‌లో ఐదుగురు విద్యార్థినులు మృతి!

    ఇజ్రాయెల్-అమెరికా వైమానిక దాడుల్లో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లోని బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులు మరణించినట్టు ఇరాన్ పేర్కొంది. ఈ యుద్ధం కారణంగా దేశంలో సంభవించిన తొలి మరణాలు ఇవే అని ఇరాన్ పేర్కొంది. స్థానిక మీడియాల ప్రకారం.. ఈ దాడి హార్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని మినాబ్ నగరంలో ఉన్న ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ (IRGC) బేస్ టార్గెట్‌గా జరిగినట్టు తెలుస్తోంది. కానీ ఈ దాడిపై ఇజ్రాయెల్, అమెరికా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది.

  • 28 Feb 2026 04:30 PM (IST)

    అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్‌ అమీర్ హతామి మృతి!

    ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన వైమానిక దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మేజర్ జనరల్ అమీర్ హతామి మరణించినట్లు స్థానిక మీడియా తెలిపాయి. అయితే ఈ విషయాన్ని ఇరాన్ అధికారులు లేదా ఇజ్రాయెల్ సైన్యం మాత్రం అధికారకంగా దృవీకరించలేదు.

  • 28 Feb 2026 04:23 PM (IST)

    ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో రగులుతున్న పశ్చిమాసియా

    ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు

    ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్

    ఒకే సారి 8 దేశాలపై దాడులు చేసిన ఇరాన్

    యూఏఈ, అబుదాబీలో భారీ పేలుళ్లు

    అమెరికా బేస్‌ క్యాంప్‌లే లక్ష్యంగా ఇరాన్ దాడులు

    ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో వెనుతిరిగిన పశ్చిమాసియాకు వెళ్తున్న ఇండిగో విమానం

    పచ్చిమాసియాకు వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఎయిర్‌లైన్స్

  • 28 Feb 2026 04:08 PM (IST)

    ఇరాన్ సుప్రీం లీడర్ టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు

    ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమెనేయి టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టెహ్రాన్‌లోని ఖమెనేయి కార్యాలయాలు, నివాస ప్రాంతాలు, కాంపౌండ్‌లకు సమీపంలో పలు క్షిపణి దాడులు జరిగాయి. ప్రకారం, ఖమెనేయి, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇతర సీనియర్ సైనిక, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరినట్టు ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు. కానీ ఈ దాడులు విజయవంతం అయ్యాయో లేదో అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే ఇరాన్ మాత్రం ఖమెనేయి టెహ్రాన్‌లో లేరని, ఆయనను ఎప్పుడో సురక్షిత ప్రదేశానికి తరలించినట్టు పేర్కొంది.

  • 28 Feb 2026 03:53 PM (IST)

    ఇరాన్, ఇజ్రాయెల్ వార్‌పై బ్రిటన్ రియాక్షన్

    అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై చేస్తున్న సైనిక దాడులు నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో విస్తృత యుద్ధంగా మారిపోవచ్చని బ్రిటన్ ప్రభుత్వం శనివారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతకు మంచిన దారుణ పరిస్థితులను తాము చూడాలనుకోవట్లేదని.. దీనికి త్వరగా ముగింపు పలకాలని బ్రిటన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే, ప్రాంతంలో ఉన్న తమ పౌరుల భద్రతను ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

  • 28 Feb 2026 03:40 PM (IST)

    ఒకేసారి 8 దేశాలపై మిస్సైళ్లు ప్రయోగించిన ఇరాన్‌

    బహ్రెయిన్‌లో అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ దాడి

    ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌, కువైట్‌, సౌదీతో పాటు..

    అబుదాబి, ఖతార్‌, జోర్డాన్‌, యూఏఈపై ఇరాన్‌ దాడులు

  • 28 Feb 2026 03:30 PM (IST)

    ఇరాన్‌లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్

    ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులు

    ఇరాన్ అణు బాంబులు తయారు చేస్తుందని కారణంతో క్షిపణుల దాడి చేసిన అమెరికా, ఇజ్రాయిల్

    ఇరాన్ అధ్యక్షుడు అలీ హొస్సేనీ ఖమేనీ భవనంపై కూడా దాడులు చేసిన శత్రు దేశాలు

    ప్రతీకారంగా ఇరాన్ ఖండాంతర క్షిపణలను ముందే పసిగట్టి కూల్చివేసిన ఇజ్రాయిల్

    ఇరాన్, ఇజ్రాయిల్ గగనతలాన్ని మూసివేసిన ఇరుదేశాలు

    ఇజ్రాయిల్, ఇరాన్‌లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అడ్వైజర్ జారీ చేసిన భారత ప్రభుత్వం

    స్థానిక ఎంబసీలను సంప్రదించేందుకు హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం

     

  • 28 Feb 2026 03:20 PM (IST)

    ఇంటర్నేషనల్ ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్

    ప్రయాణికులకు ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అడ్వైజర్ జారీ

    ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలకు అంతరాయం

    ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వచ్చేముందే సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచన

     

  • 28 Feb 2026 03:13 PM (IST)

    ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు

    ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అనేక సైనిక స్థావరాలపై దాడి చేసిందని ఇజ్రాయెల్ సైన్యం కాసేపటి క్రితమే ప్రకటించింది. అలాగే ఇరాన్‌లోని ఇరాన్ పాలనకు చెందిన అనేక సైనిక లక్ష్యాలపై కూడా విస్తృత దాడి చేస్తున్నట్టు తెలిపింది.

  • 28 Feb 2026 03:05 PM (IST)

    ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు

    ఇరాన్‌పై క్షిపణులు ప్రయోగించిన ఇజ్రాయెల్‌, అమెరికా

    ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ భవనంపై దాడులు

    ఇరాన్, ఇజ్రాయెల్ గగనతలం మూసివేత

    భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని..

    అడ్వైజరీ జారీ చేసిన భారత ప్రభుత్వం

    హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం

    ఇరాన్‌లో నిలిచిపోయిన మొబైల్, ఇంటర్నెట్ సేవలు

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ భీకరయుద్దం మొదలయ్యింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా బలగాలు ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపించాయి. కౌంటర్‌గా ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించింది. 70 ఖండాంతర క్షిపణులను ఇరాన్‌ ప్రయోగించింది. ఇరాన్‌ ప్రయోగించిన మిస్సైళ్లను కూల్చేస్తునట్టు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది. . ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు జరిగాయి. 30 ప్రాంతాల్లో మిసైల్‌ దాడులు చేపట్టింది ఇజ్రాయెల్‌ . – ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోతతో దద్దరిల్లింది. ఖమేనీ కార్యాలయాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ అటాక్‌ చేసింది.
ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఈ దాడులకు సింహగర్జన అని పేరు పెట్టింది.

ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల తరువాత ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. బంకర్‌ లోకి ఆయన వెళ్లిపోయారు. — ఇరాన్‌ డిఫెన్స్‌ సిస్టంపైనా ఇజ్రాయెల్‌ దాడులు చేసినట్లు తెలుస్తోంది. డిఫెన్స్‌ సిస్టమ్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు ఇరాన్‌ అధికారులు వెల్లడించారు. ఇరాన్‌కు పదే పదే హెచ్చరికలు జారీచేస్తూ వచ్చాయి అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు. ఈ దాడుల తరువాత ఇరాన్‌ తన ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది.

ఇరాన్‌ అణ్వాయుధాలను అంతం చేసే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌ సెన్యం వెంటనే లొంగిపోవాలని హెచ్చరించారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తున్న నెంబర్‌వన్‌ దేశంగా ఇరాన్‌ మారిందన్నారు. ఇజ్రాయెల్‌, అమెరికా దాడులపై ఇరాన్‌ స్పందించింది. యుద్దం మీరు మొదలుపెట్టారు. ముగింపు మేము పలుకుతాం అంటూ స్టేట్‌మెంట్‌ విడుదల చేసింది.

ఇరాన్‌పై దాడుల తర్వాత ఇజ్రాయెల్‌ అప్రమత్తం అయింది. స్టేట్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయ్. దేశ పౌరులను అప్రమత్తం చేసింది ఇజ్రాయెల్ సైన్యం  దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. అంతేకాదు ఇజ్రాయెల్‌లోని ఇండియన్‌ ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు ఎక్కడ ఉన్నా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెప్పింది. అత్యవసరం అయితే తప్ప.. బయటకు రావొద్దని హెచ్చరించింది భారత ఎంబసీ.

మరిన్ని అంతార్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us