
ఉక్రెయిన్ రాజధాని కైవ్లోని మంత్రుల మండలి భవనంపై రష్యా ఆదివారం (సెప్టెంబర్ 7) డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఒక్కసారిగా మంత్రుల మండలి భవనం పైకప్పు నుండి పొగలు పైకి వ్యాపించాయి. అగ్నిమాపక దళం సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. ఈ భవనంలో మంత్రుల ఇళ్ళు, కార్యాలయాలు రెండూ ఉన్నాయి. రాజధానిలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయంతో సహా అనేక నివాస భవనాలు మంటల్లో చిక్కుకున్నాయి.
కీవ్లో రష్యా పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. నగరంపై డ్రోన్ దాడులతో దాడి ప్రారంభమైంది. ఆపై క్షిపణి దాడులు జరిగాయని కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో అన్నారు. రష్యా ఇప్పటివరకు ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకోవడం మానేసింది. రష్యా ఇప్పుడు ఉక్రెయిన్పై వైమానిక దాడులను పెంచబోతోందని తెలుస్తుంది.
గత రెండు వారాల్లో కీవ్పై జరిగిన రెండవ అతిపెద్ద దాడి. ఇప్పుడు రెండు దేశాల మధ్య శాంతి చర్చల ఆశలు సన్నగిల్లుతున్నాయి. శనివారం రాత్రి కీవ్పై రష్యా వరుస దాడులు నిర్వహించింది. ఇందులో ఒక చిన్నారితో సహా ముగ్గురు మరణించారు. డార్నిట్స్కీలోని ఒక నివాస భవనం 2వ అంతస్తులో మంటలు చెలరేగాయి. కీవ్లోని పశ్చిమ స్వియాటోషిన్స్కీ జిల్లాలోని 9 అంతస్తుల భవనం క్షిపణి దాడుల కారణంగా మంటల్లో చిక్కుకుంది.
ఉక్రెయిన్లోని క్రెమెన్చుక్ నగరంలో డజన్ల కొద్దీ పేలుళ్లు జరిగాయని, కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని మేయర్ విటాలీ మాలెట్స్కీ తెలిపారు. క్రివి రిహ్లోని రవాణా, పట్టణ మౌలిక సదుపాయాలను రష్యా లక్ష్యంగా చేసుకున్నట్లు సైనిక అధికారిక చీఫ్ ఒలెక్సాండర్ విల్కుల్ తెలిపారు. దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సాలో నివాస భవనాలు దెబ్బతిన్నాయి.
ఈ దాడులపై రష్యా ఇంకా స్పందించలేదు. ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలను ఇరు వర్గాలు ఖండిస్తున్నాయి. అయినప్పటికీ, యుద్ధంలో వేలాది మంది పౌరులు మరణించారు. మరోవైపు, పశ్చిమ ఉక్రెయిన్పై వైమానిక దాడుల ముప్పు ఉందని పోలిష్ సాయుధ దళాలు చెబుతున్నాయి. వాయు భద్రతను నిర్ధారించడానికి మేము మా విమానాలను సిద్ధం చేశామని తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..