శ్రీలంకను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన రాజపక్స కుటుంబానికి ఉచ్చు బిగుసుకుంది. నాలుగు రోజుల క్రితం అధ్యక్ష భవనం వదిలి పారిపోయిన గొటబయ రాజపక్స, బుధవారం రిజైన్ చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే రాజీనామా లేఖపై ఆయన సంతకం చేసినట్టు చెబుతున్నారు. అయితే ఆయన ఎక్కడున్నారనే విషయం మిస్టరీగా ఉండగా ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. అదేమిటంటే దేశం విడిచి పారిపోవాలని రాజపక్స చేసిన ప్రయత్నాలు ఫలించలేదట. ఆయనకు స్టాంపింగ్ చేసేందుకు ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు నో చెప్పారట. దీంతో ఆయన ఎయిర్పోర్ట్కు దగ్గర్లోని మిలిటరీ బేస్లో ఓ రాత్రంతా ఎదురుచూస్తూ ఉండిపోయారని సమాచారం. రాజీనామా చేశాక అరెస్ట్ చేసే చాన్స్ ఉండటంతో విదేశాలకు పారిపోవాలని చూస్తున్నారు రాజపక్స. నిరసనకారులు కొలంబోలోని తన అధికారిక నివాసాన్ని ఆక్రమించుకునేలోపే 73 ఏళ్ల నాయకుడు పారిపోయాడు. ప్రెసిడెంట్గా, రాజపక్స అరెస్టు నుంచి బయట పడ్డారు. నిరసనకారుల దాడుల నుంచి తప్పించుకునేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లగా తెలుస్తోంది. పదవీవిరమణ చేసే ముందు అతను విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
గొటబయ రాజపక్స చీఫ్ ఎయిర్ మార్షల్కు చెందిన ప్రైవేట్ బిల్డింగ్లో తలదాచుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ కథనాలను శ్రీలంక ఎయిర్ ఫోర్స్ ఖండించింది. ఎయిర్ ఫోర్స్ ఇమేజ్ను దెబ్బతీసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. గొటబయ రాజపక్స సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స కూడా దుబాయ్ పారిపోవడానికి ట్రై చేశారు. అయితే ఎయిర్పోర్ట్లో ఆయనను స్టాఫ్ అడ్డుకున్నారు.
బసిల్కు అమెరికా పౌరసత్వం ఉంది. దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లేందుకు బసిల్ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. మరోవైపు, రాజకపక్స సోదరులు ఎవరూ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించాలని కోరుతూ శ్రీలంక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
గొటబయ రాజపక్స బుధవారం రాజీనామా చేస్తానని ప్రకటించడంతో అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు ముందుకొచ్చారు సుజిత్ ప్రేమదాస. ఎస్జేబీ పార్టీ అధ్యక్షుడైన ప్రేమదాస ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానన్న ప్రకటించిన ప్రేమదాస మద్దతు కోసం ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. శ్రీలంకలో పదవులు చేపట్టడానికి నాయకులందరూ భయపడుతున్న వేళ ప్రేమదాస ముందుకురావడం విశేషం.
ఓ ప్లాన్ ప్రకారం శ్రీలంకను సంక్షోభం నుంచి బయటపడేస్తానని అంటున్నారు ప్రేమదాస. ఈ నెల 20న కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. మరోవైపు, శ్రీలంక అధ్యక్ష భవనం నిరసనకారులకు అడ్డాగా మారింది. నాలుగు రోజుల కిందట ప్రెసిడెంట్ ప్యాలస్ను ఆక్రమించిన నిరసనకారులు దాన్ని పిక్నిక్ స్పాట్గా మార్చేశారు.
ఏప్రిల్లో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజపక్సే చిన్న సోదరుడు బాసిల్, విమానాశ్రయ సిబ్బందితో ఇదే విధమైన ప్రతిష్టంభన తర్వాత మంగళవారం తెల్లవారుజామున దుబాయ్కి వెళ్లే తన స్వంత ఎమిరేట్స్ విమానాన్ని కోల్పోయారు.
శ్రీలంక జాతీయతతో పాటు US పౌరసత్వాన్ని కలిగి ఉన్న బాసిల్ — వ్యాపార ప్రయాణీకుల కోసం చెల్లింపు ద్వారపాలకుడి సేవను ఉపయోగించడానికి ప్రయత్నించారు. అయితే విమానాశ్రయం, ఇమ్మిగ్రేషన్ సిబ్బంది వారు తక్షణమే ఫాస్ట్ ట్రాక్ సేవ నుండి వైదొలుగుతున్నట్లు తెలిపారు.