శ్రీలంకలో సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత

ఉగ్రదాడుల నేపథ్యంలో సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని శ్రీలంక ప్రభుత్వం ఎత్తి వేసింది. వరుస పేలుళ్ల అనంతరం, భయాందోళనలను పెంచే సమాచారం వేగంగా విస్తరించకుండా, మత కల్లోలాలు చోటు చేసుకోకుండా ఉండటం కోసం ఈ నిషేధాన్ని అక్కడి ప్రభుత్వం విధించింది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అన్నింటినీ బ్యాన్ చేసింది. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని నిషేధాన్ని ఎత్తివేసిన సందర్భంగా ప్రజలను ప్రభుత్వం కోరింది. దేశంలో పరిస్థితి ఇంకా సాధారణ […]

శ్రీలంకలో సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2019 | 8:09 PM

ఉగ్రదాడుల నేపథ్యంలో సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని శ్రీలంక ప్రభుత్వం ఎత్తి వేసింది. వరుస పేలుళ్ల అనంతరం, భయాందోళనలను పెంచే సమాచారం వేగంగా విస్తరించకుండా, మత కల్లోలాలు చోటు చేసుకోకుండా ఉండటం కోసం ఈ నిషేధాన్ని అక్కడి ప్రభుత్వం విధించింది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అన్నింటినీ బ్యాన్ చేసింది.

సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని నిషేధాన్ని ఎత్తివేసిన సందర్భంగా ప్రజలను ప్రభుత్వం కోరింది. దేశంలో పరిస్థితి ఇంకా సాధారణ స్థాయికి రాలేదని, అందువల్ల సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఉగ్రవాదులు జరిపిన వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల్లో 250 మంది చనిపోయారు. దాదాపు 500 మంది క్షతగాత్రులయ్యారు. చనిపోయిన వారిలో పలువురు భారతీయులు కూడా ఉన్న సంగతి విదితమే.