AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉక్రెయిన్‌పై దాడులకు పుతిన్ బ్రేక్.. తెరపైకి అమెరికా దౌత్యం!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చర్చల కోసం అమెరికా ప్రతినిధులు మాస్కోకు చేరుకోవడంతో, ఇరు దేశాలు తాత్కాలికంగా దాడులు ఆపేశాయి. పుతిన్, జెలెన్‌స్కీ ప్రకటించిన ఈ మూడు రోజుల విరామం శాశ్వత శాంతికి దారితీస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఉక్రెయిన్‌పై దాడులకు పుతిన్ బ్రేక్.. తెరపైకి అమెరికా దౌత్యం!
Putin And Zelensky Agree On A 3 Day Ceasefire
Sharada V
|

Updated on: Sep 05, 2026 | 10:35 PM

Share

చర్చలు జరిగే సమయంలో ఎటువంటి దాడులు జరగకూడదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఒక రోజు ముందే రష్యాకు ఒక ప్రతిపాదన పంపారు. తమ వైపు నుంచి ఎలాంటి వైమానిక దాడులు ఉండవని, రష్యా కూడా అదే విధంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. యుద్ధానికి తెరదించేందుకు వాస్తవమైన మార్గాలను అన్వేషిస్తున్నామని, ఇందుకు అమెరికా దౌత్యవేత్తలు ఎలాంటి ప్రణాళికలతో వస్తున్నారో వేచి చూడాలని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఉక్రెయిన్ నగరాలపై రష్యా విరుచుకుపడి తీవ్రమైన దాడులు చేసిన తరుణంలోనే ఈ తాత్కాలిక శాంతి పరిణామం అంశం తెరపైకి వచ్చింది.

మాస్కోకు చేరుకున్న అమెరికా ప్రతినిధులు

శనివారం అర్ధరాత్రి నుంచి కీవ్ నగరంపై మూడు రోజుల పాటు ఎలాంటి దాడులు చేయకూడదని పుతిన్ ఆదేశించారు. అమెరికా ప్రతినిధులు ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికా ప్రతినిధులు విట్‌కాఫ్, కుష్నర్‌ శనివారం మాస్కోకు చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి రష్యా ప్రతినిధి కిరిల్ దిమిత్రియేవ్ సాదర స్వాగతం పలికారు. వారి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అమెరికా ప్రతినిధులు ఆదివారం కీవ్ నగరానికి వెళ్లే అవకాశం ఉంది. గతంలో వీరు మాస్కోకు వచ్చినా, కీవ్‌లో పర్యటించడం మాత్రం ఇదే మొదటిసారి

అమెరికా ప్రతినిధులు పర్యటించే సమయంలో తమ వైపు నుంచి కూడా ఎలాంటి వైమానిక దాడులు ఉండవని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ముందే ప్రకటించారు. రష్యా కూడా అదే పద్ధతిని పాటించాలని ఆయన కోరారు. అయితే, అమెరికా ప్రతినిధులు రావడానికి సరిగ్గా ముందే రష్యా బలగాలు కీవ్ నగరంపై, బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై విరుచుకుపడ్డాయని జెలెన్‌స్కీ ఆరోపించారు. అమెరికా ప్రతినిధులు విమానంలో నేరుగా ఉక్రెయిన్‌కు చేరుకునే మార్గాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణుల కారణంగా రష్యా గగనతలం కూడా ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మారిందని ఆయన హెచ్చరించారు. రాబోయే వారంలో రష్యా గగనతలంలో తమ తదుపరి చర్యలను దానికి తగినట్లుగా మార్చుకుంటామని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఐదో ఏడాదికి అడుగుపెట్టింది. సుమారు 1,250 కిలోమీటర్లు విస్తరించిన యుద్ధరంగంలో ఇరు దేశాల సైన్యాలు ఎటూ కదలలేక ఒకే చోట నిలిచిపోయాయి. ఈ సమయంలో అమెరికా ప్రతినిధులు మాస్కో, కీవ్‌లో పర్యటిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్ ప్రకటించిన 72 గంటల తాత్కాలిక విరామం చర్చలకు సరైన వాతావరణాన్ని ఇస్తుందా? అమెరికా చొరవతో ఇరు దేశాలు మళ్లీ చర్చలకు  వస్తాయా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చూడండి

Follow Us