AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడాదిగా ఫ్రిజ్‌లో న్యూడిల్స్‌.. తిని తొమ్మిది మంది మృతి

చైనాలో దారుణం చోటుచేసుకుంది. ఏడాదికి పైగా ఫ్రిజ్‌లో ఉన్న న్యూడిల్స్‌ తిని ఒకే ఇంట్లో తొమ్మిది మంది మరణించారు.

ఏడాదిగా ఫ్రిజ్‌లో న్యూడిల్స్‌.. తిని తొమ్మిది మంది మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 21, 2020 | 5:16 PM

Share

Nine family members die: చైనాలో దారుణం చోటుచేసుకుంది. ఏడాదికి పైగా ఫ్రిజ్‌లో ఉన్న న్యూడిల్స్‌ తిని ఒకే ఇంట్లో తొమ్మిది మంది మరణించారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. నార్త్‌ ఈస్ట్రన్‌ చైనీస్ ప్రాంతంలోని హెయిలోంగ్‌జియాంగ్‌లో అక్టోబర్ 5న ఓ కుటుంబంలో 12 మంది బంధువులు కలుసుకున్నారు. అందులో 9 మంది మొక్కజొన్న పిండితో చేసిన సున్‌ టంగ్ జి అనే ప్రత్యేక న్యూడిల్‌ డిష్‌ని తిన్నారు. దాన్ని ఏడాదిగా ఫ్రిజ్‌లో ఉంచగా.. మార్నింగ్ ఫుడ్‌ మీటింగ్‌లో తిన్నారు. వెంటనే ఆ తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. అందులో 7 మంది ఈ నెల 10న మరణించారు. ఇక ఈ నెల 12న ఒకరు, 19న మరొకరు మరణించారు. దీనిపై చైనీస్ హెల్త్‌ కమిషన్ జాతీయ హెచ్చరికను చేసింది. పులియబెట్టిన పిండితో చేసిన వంటలను తినడం మానేయాలని సూచించింది.

Read More:

అనిల్ రావిపూడికి ‘ఇండియన్ పనోరమ’ అవార్డు

కరోనా: 215 రోజుల తరువాత కలుసుకున్న వృద్ధ జంట.. భావోద్వేగ వీడియో వైరల్‌