పాక్‌లో ఆగని అజ్ఞాత వ్యక్తుల దాడులు.. ఈసారి టార్గెట్ లష్కరే తైబా వ్యవస్థాపకుడు..!

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో గురువారం (ఏప్రిల్ 16) ఉదయం జరిగిన ఒక సంచలన ఘటనలో, ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా (LeT) వ్యవస్థాపకుడు మౌలానా అమీర్ హమ్జా ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గుర్తుతెలియని దుండగులు జరిపిన ఈ కాల్పుల్లో హమ్జా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పాకిస్థాన్‌లో పెరుగుతున్న అంతర్గత అభద్రతను మరోసారి తెరపైకి తెచ్చింది.

పాక్‌లో ఆగని అజ్ఞాత వ్యక్తుల దాడులు.. ఈసారి టార్గెట్ లష్కరే తైబా వ్యవస్థాపకుడు..!
Lashkar E Taiba Founder Maulana Amir Hamza

Updated on: Apr 16, 2026 | 2:59 PM

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో గురువారం (ఏప్రిల్ 16) ఉదయం జరిగిన ఒక సంచలన ఘటనలో, ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా (LeT) వ్యవస్థాపకుడు మౌలానా అమీర్ హమ్జా ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గుర్తుతెలియని దుండగులు జరిపిన ఈ కాల్పుల్లో హమ్జా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పాకిస్థాన్‌లో పెరుగుతున్న అంతర్గత అభద్రతను మరోసారి తెరపైకి తెచ్చింది.

ఏప్రిల్ 16, 2026 ఉదయం సుమారు 10 గంటల సమయంలో, లాహోర్‌లోని పాకో రోడ్డు వద్ద ఉన్న పిండి స్టాప్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అమీర్ హమ్జా ఒక స్థానిక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి, తన కారులో తిరిగి వస్తుండగా మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాటువేసి వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ ఆకస్మిక దాడిలో ఒక బుల్లెట్ హమ్జా కుడి చేతిని రాసుకుంటూ వెళ్లడంతో ఆయన రక్తగాయాలపాలయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దాడి జరిగిన సమయంలో కారులో హమ్జాతో పాటు పాకిస్థాన్ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ నజీర్ అహ్మద్ ఘాజీ కూడా ఉన్నారు. అయితే, ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

కాల్పుల అనంతరం రక్తపు మడుగులో ఉన్న హమ్జాకు వెంటనే ప్రథమ చికిత్స అందించారు. లష్కరే తైబా రాజకీయ విభాగమైన పాకిస్థాన్ మార్కజీ ముస్లిం లీగ్, హమ్జా ఫోటోను విడుదల చేస్తూ ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయన తన నివాసంలో లాహోర్ పోలీసుల భారీ భద్రత నడుమ ఉన్నట్లు సమాచారం. ఇదిలావుంటే, భారత్ మరియు అమెరికా ఇప్పటికే లష్కరే తైబాను ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. హాఫిజ్ సయీద్‌తో కలిసి ఈ సంస్థను స్థాపించడంలో అమీర్ హమ్జా కీలక పాత్ర పోషించారు.

ఈ ఘటనపై లాహోర్ పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ఈ దాడి వెనుక ఉన్నది ఎవరు? ఇది అంతర్గత ముఠా తగాదాలా లేక మరేదైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రవాద నాయకులే లక్ష్యంగా జరుగుతున్న ఇటువంటి దాడులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us