పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల చిహ్నం ‘దొంగ’ అయితే బెటర్..విపక్ష నేత మరియం నవాజ్ ధ్వజం

| Edited By: Anil kumar poka

Jul 11, 2021 | 2:04 PM

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల చిహ్నం 'దొంగ' అయితే బెటర్ అని విపక్ష పాకిస్తాన్ ముస్లిం లీగ్ -నవాజ్ (పీఎంఎల్-నవాజ్) నేత మరియం నవాజ్ అన్నారు. ఆయన పార్టీ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్ బదులు 'దొంగ' కావాలని ఈ పార్టీ ఉపాధ్యక్షురాలు కూడా అయిన మరియం పేర్కొన్నారు.

పాకిస్తాన్ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల చిహ్నం దొంగ అయితే బెటర్..విపక్ష నేత మరియం నవాజ్ ధ్వజం
Imran Khan's Election Symbol Should Be Thief Says Pml Nawaz Leader Maryam Nawaz,islamabad,pm Imran Khan,election Symbol,thief,opposition Leader Maryam Nawaz,bat
Follow us on

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల చిహ్నం ‘దొంగ’ అయితే బెటర్ అని విపక్ష పాకిస్తాన్ ముస్లిం లీగ్ -నవాజ్ (పీఎంఎల్-నవాజ్) నేత మరియం నవాజ్ అన్నారు. ఆయన పార్టీ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్ బదులు ‘దొంగ’ కావాలని ఈ పార్టీ ఉపాధ్యక్షురాలు కూడా అయిన మరియం పేర్కొన్నారు. 2018 లో ఇమ్రాన్ బ్యాట్ తో ‘ఎన్నికను దొంగిలిలించారని’ ఆమె ఆరోపించారు. దేశంలో చక్కర, పిండి వంటినిత్యావసరాల కోసం ..అది కూడా ఒకటిన్నర, ఒక కేజీ కోసం వృద్దులు కూడా గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోందని, నిత్యావసరాలను ఈ ప్రభుత్వం దోచుకుంటోందని ఆమె మండిపడ్డారు. షార్థా టౌన్ లో నిన్న జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆమె.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకువెళ్తే ఈ ప్రధాని తిరోగమన పథం లోకి తీసుకువెళ్తున్నారన్నారు. ఈ ప్రధానికి దేశంలో గానీ, విదేశాల్లో గానీ గౌరవం లేదని అన్నారు. జులై 25 న ఇక్కడ జరిగే ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మరియం నవాజ్ కోరారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ చిహ్నమైన ‘సింహం’ విజేతగా నిలుస్తుందన్నారు.

మన కాశ్మీర్ ను అమ్మేసిన వ్యక్తిని ఎవరూ నమ్మబోరని ఆమె పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ నేరుత్వంలోనే.. ఈ భారత ఆక్రమిత కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుందన్నారు. ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, వారి ఆశలు నెరవేరే రోజులు రానున్నాయని మరియం నవాజ్ వ్యాఖ్యానించారు. పాక్ లో 11 ప్రతిపక్షాల కూటమి ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి  : News Watch : దేవుడితోనైనా కొట్లాడతాం..:కేటీఆర్.మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…( వీడియో )

 భారత్ లో మల్లి మొదలైన డెల్టా వేరియంట్ టెన్షన్ లైవ్ వీడియో..:Delta Variant Live Video.

 8 మంది పిల్లలు రూ.3 కోట్లు జరిమానా..10 లక్షలు డిస్కౌంట్..!చైనా లో కుటుంబ నియంత్రణ పాటించని వ్యక్తి.:China Video.

 పోస్టాఫీసులో సేవింగ్స్‌ ఖాతా ఉందా…. అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే..మరిన్ని వివరాలు ఈ వీడియోలో..:Post Office Video.