మరోసారి తుపాకీ కాల్పులతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. లాస్ఏంజెల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. చైనీయుల లూనార్ న్యూఇయర్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతండగా.. ఈ ఘటన జరగడం తీవ్ర విషాదం నింపింది. కాల్పుల్లో సుమారు పది మంది వరకు మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తునానికి ఆరుగురికి గాయాలైనట్లు గుర్తించారు. కాల్పులు చేసిన వ్యక్తి.. ఘటన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని పరిశీలించారు. ఘఠనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
అయితే.. ఓ వ్యక్తి భారీ మెషీన్ గన్తో కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి సమీపంలో సియాంగ్ వాన్ చాయి అనే వ్యక్తి బార్బెక్యూ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. రాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రాణభయంతో అతడి రెస్టారెంట్లోకి వచ్చి తలుపులు వేసేశారు. ఓ వ్యక్తి గన్తో కాల్పులు జరుపుతున్నాడని వారు చెప్పారు. డ్యాన్సింగ్ క్లబ్ లక్ష్యంగా దాడి చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. క్షతగాత్రుల ఆర్తనాదాలు, మృతుల కుటుంబీకుల రోదనలతో ఘటన స్థలం బీభత్సంగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.