Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌-మారిషస్‌ మధ్య కీలక ఒప్పందాలు.. 8 ఒప్పందాలపై మోదీ, రామ్ గులామ్ సంతకాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు మారిషస్ పర్యటనకు వెళ్లారు. బుధవారం(మార్చి 12) ఆయన పర్యటనలో రెండు దేశాల మధ్య 8 ప్రధానాంశాలపై ఒప్పందం కుదరింది. ఆర్ధిక నేరాలను అరికట్టడంపై ఇరుదేశాల మధ్య ప్రధానంగా ఒప్పందం కుదిరింది. దీంతో పాటు మరో 8 ఒప్పందాలపై కూడా సంతకాలు జరిగాయి. రక్షణ రంగంలో కూడా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

భారత్‌-మారిషస్‌ మధ్య కీలక ఒప్పందాలు.. 8 ఒప్పందాలపై మోదీ, రామ్ గులామ్ సంతకాలు
Pm Modi With Mauritius Pm Navinchandra Ramgoolam
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 12, 2025 | 2:19 PM

ప్రధాని మోదీ మారిషస్‌ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. మారిషస్‌తో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మారిషస్‌ ప్రధాని నవీన్‌ చంద్ర రామ్‌ గులామ్‌తో కలిసి ఒప్పందాలపై సంతకాలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భారత, మారిషస్‌ రిజర్వ్‌ బ్యాంక్‌లు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు మారిషస్ పర్యటనకు వెళ్లారు. బుధవారం(మార్చి 12) ఆయన పర్యటనలో రెండు దేశాల మధ్య 8 ప్రధానాంశాలపై ఒప్పందం కుదరింది. ఆర్ధిక నేరాలను అరికట్టడంపై ఇరుదేశాల మధ్య ప్రధానంగా ఒప్పందం కుదిరింది. దీంతో పాటు మరో 8 ఒప్పందాలపై కూడా సంతకాలు జరిగాయి. రక్షణ రంగంలో కూడా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

విధానం షరతులతో కూడిన సహాయం కంటే పరస్పర గౌరవం, స్థిరత్వం, సామర్థ్య నిర్మాణంపై దృష్టి పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, కనెక్టివిటీ ప్రాజెక్టులకు మద్దతు ఇస్తూ, బలమైన భాగస్వామిగా భారతదేశ ఉంటుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. మారిషస్‌కు అన్ని రంగాల్లో భారత్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మోదీ. రక్షణ రంగమైనా , విద్యా రంగమైనా భారత్‌ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. రెండు దేశాల మధ్య తరతరాల నుంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు.

మారిషస్‌లో సివిల్ సర్వీస్ కళాశాల, ఏరియా హెల్త్ సెంటర్ ప్రాజెక్టులు మారిషస్ పరిపాలనా, ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, దీర్ఘకాలిక అభివృద్ధి, సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబించాయి. భారతదేశం నుండి గ్రాంట్ రూపంలో సాయం అందించాలని నిర్ణయించారు. ఇది మారిషస్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. మారిషస్ కేవలం ఒక భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, మారిషస్ ఒక కుటుంబం అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ సముద్ర దృక్పథంలో మారిషస్ కేంద్రంగా ఉంది. మారిషస్ అభివృద్ధి చెందినప్పుడు, భారతదేశం ముందుగా జరుపుకుంటుంది. భారతదేశం బలమైన భాగస్వామిగా అనేక దేశాలకు సహాయం చేసిన దేశం మారిషస్ అని ప్రధాని మోదీ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..