భారత్ భయంతో వణుకుతున్న పాకిస్తాన్లో అర్థరాత్రి భూకంపం.. భయభ్రాంతులకు గురైన జనం!
భారతదేశంపై డ్రోన్ దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్లో మే 9వ తేదీ అర్థరాత్రి ఆకస్మిక భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైందని అధికారులు తెలిపారు. ఏజెన్సీ నుండి అందిన సమాచారం ప్రకారం, రాత్రి 1:44 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.

భారతదేశంపై డ్రోన్ దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్లో మే 9వ తేదీ అర్థరాత్రి ఆకస్మిక భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైందని అధికారులు తెలిపారు. ఏజెన్సీ నుండి అందిన సమాచారం ప్రకారం, రాత్రి 1:44 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
శనివారం(మే 10) తెల్లవారుజామున 1:44 గంటలకు పాకిస్తాన్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంపం కారణంగా, ప్రజల్లో భయాందోళనలు వ్యాపించాయి. అయితే, ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు.
An earthquake with a magnitude of 4.0 on the Richter Scale hit Pakistan at 01.44 am (IST) today: National Center for Seismology (NCS) pic.twitter.com/zAuDQQ2WRQ
— ANI (@ANI) May 9, 2025
భారతదేశంతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య భూకంప ప్రకంపనలు సంభవించిన వెంటనే, ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారని సమాచారం. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నగరానికి సమీపంలో భూకంప ప్రకంపనలు సంభవించాయని చెబుతున్నారు. అయితే, ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు.
ఇదిలావుంటే, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, ఆపరేషన్ సిందూర్ కింద భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాదులు దాక్కున్న 9 ప్రదేశాలను ధ్వంసం చేసింది. భారతదేశం చర్య తర్వాత, పాకిస్తాన్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుండి పంజాబ్, రాజస్థాన్ వరకు పౌరులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడి చేస్తోంది. అయితే, పాకిస్తాన్ పిరికి దాడులకు భారత సైన్యం తగిన సమాధానం ఇస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..