ప్రమాదకర వాహన నౌకను ప్రారంభించిన చైనా.. ఆందోళనలో భారత్, అమెరికా..

చైనాకు చెందిన ఈ కొత్త యుద్ధనౌక తొలి డ్రోన్ విమాన వాహక నౌకగా అభివర్ణించబడుతోంది. ఈ ఓడ 50 మానవరహిత వ్యవస్థలను మోసుకెళ్లగలదు. ఇంకా అనేక సదుపాయాలు, సౌకర్యాలను కలిగి ఉంది.

ప్రమాదకర వాహన నౌకను ప్రారంభించిన చైనా.. ఆందోళనలో భారత్, అమెరికా..
Aircraft
Follow us

|

Updated on: Jun 17, 2022 | 2:13 PM

చైనా తన మూడవ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఫుజియాన్‌ను శుక్రవారం ప్రారంభించింది. చైనాకు చెందిన ఈ కొత్త యుద్ధనౌక తొలి డ్రోన్ విమాన వాహక నౌకగా అభివర్ణించబడుతోంది. ఈ ఓడ 50 మానవరహిత వ్యవస్థలను మోసుకెళ్లగలదు. ఇంకా అనేక సదుపాయాలు, సౌకర్యాలను కలిగి ఉంది.

చైనా తన విస్తరణ విధానంలో తన భూ, వాయు, నావికా బలగాల బలాన్ని రోజురోజుకూ పెంచుకుంటోంది. చైనా తన నౌకాదళానికి కొత్త యుద్ధ నౌకలు, ఆయుధాలను కూడా జోడిస్తోంది. ఈ క్రమంలోనే చైనా తన మూడవ విమాన వాహక నౌక ఫుజియాన్‌ను శుక్రవారం ప్రారంభించింది. కోవిడ్-19, లాక్‌డౌన్‌ కారణంగా షాంఘైలో కారణంగా దీని ఆవిష్కరణ రెండు నెలలు ఆలస్యమైంది. మునుపటి షెడ్యూల్ ప్రకారం, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (PLAN) 73వ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 23న దీన్ని ప్రారంభించాల్సి ఉంది. తూర్పు తీరప్రాంత ప్రావిన్స్ ఫుజియాన్ పేరు మీదుగా మూడవ విమాన వాహక నౌకను శుక్రవారం ప్రారంభించినట్లు చైనా అధికారిక మీడియా నివేదించింది. చైనా యొక్క మొదటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, లియానింగ్, 2012లో ప్రారంభించబడిన సోవియట్ కాలం నాటి ఓడ యొక్క శుద్ధి చేసిన వెర్షన్. దీని తరువాత, 2019 లో, చైనా రెండవ విమాన వాహక నౌక ‘షాన్డాంగ్’ ను ప్రారంభించింది. ఇది పూర్తిగా చైనాలో తయారు చేయబడింది.

ఇవి కూడా చదవండి

చైనాకు చెందిన ఈ కొత్త యుద్ధనౌక తొలి డ్రోన్ విమాన వాహక నౌకగా అభివర్ణించబడుతోంది. మానవ రహిత పడవలు, డ్రోన్లు, నీటి అడుగున వాహనాలతో సహా 50 మానవ రహిత వ్యవస్థలను ఓడ మోసుకెళ్లగలదు. కొత్త విమాన వాహక నౌకలను నిర్మించడంతో సహా చైనా తన నౌకాదళాన్ని వేగంగా ఆధునీకరిస్తోంది. పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC)తో పాటు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కూడా సైన్యానికి అధిపతిగా ఉన్నారు. తన పదవీకాలంలో సైన్యంలో అనేక సమగ్ర సంస్కరణలు, సైన్యం పరిమాణం తగ్గించడం మరియు నౌకాదళం మరియు వైమానిక దళం పాత్రను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.

అదే సమయంలో, ప్రపంచ విస్తరణను దృష్టిలో ఉంచుకుని హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోని జిబౌటీలో చైనా సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. శ్రీలంకలోని హంబన్‌తోట ఓడరేవును కూడా చైనా 99 ఏళ్ల లీజుకు తీసుకుంది మరియు అరేబియా సముద్రంలో పాకిస్థాన్‌కు చెందిన గ్వాదర్ ఓడరేవును విస్తరించి, ఆధునీకరించింది.