సెల్‌ఫోన్ విషయంలో వివాదం తల్లిదండ్రులతో పాటు అక్కని చంపిన బాలుడు.. మృతదేహాలతో ఇంట్లోనే..

|

May 24, 2024 | 4:27 PM

దత్తత తీసుకున్న యువకుడు సెల్ ఫోన్ ను ఉపయోగిస్తుండగా తన సెల్‌ఫోన్ తీసుకెళ్ళినందుకు తన తల్లిదండ్రులను, అక్కని కాల్చి చంపినట్లు పోలీసులు  తెలిపారు. స్థానిక భద్రతా మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం శుక్రవారం ఈ హత్యలు జరగగా.. బాలుడు పోలీసులకు సోమవారం తన నేరం గురించి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు ఈ ట్రిపుల్ హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు పిల్లలు మొబైల్ ఫోన్ విషయంలో గొడవపడుతుండగా.. తల్లిదండ్రులు ఆ ఫోన్ ను తీసుకుని వెళ్ళడంతో ఆ బాలుడు "చాలా నిరుత్సాహానికి గురయ్యాడు" అని ఇన్వెస్టిగేషన్ చీఫ్, రాబర్టో అఫోన్సో చెప్పారు

సెల్‌ఫోన్ విషయంలో వివాదం తల్లిదండ్రులతో పాటు అక్కని చంపిన బాలుడు.. మృతదేహాలతో ఇంట్లోనే..
Brazilian Boy Kills Parents
Follow us on

పిలల్లు పెద్దలు అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు.. ఇది మానసికంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది అంటూ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ బాలుడు సెల్ ఫోన్ కు అడిక్ట్ అయ్యాడు. తన వద్ద ఉన్న ఫోన్ తీసుకున్నందుకు ఏకంగా తల్లిదండ్రులను, అక్కను కాల్చి చంపాడు. అంతేకాదు వీరి మృతదేహాలతో వారాలు గడిపిన ఘటన బ్రెజిల్ సావోపోలో లో చోటు చేసుకుంది. వారం రోజుల అనంతరం 13 ఏళ్ల ఆ బాలుడు స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి నేరాన్ని ఒప్పుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

దత్తత తీసుకున్న యువకుడు సెల్ ఫోన్ ను ఉపయోగిస్తుండగా తన సెల్‌ఫోన్ తీసుకెళ్ళినందుకు తన తల్లిదండ్రులను, అక్కని కాల్చి చంపినట్లు పోలీసులు  తెలిపారు. స్థానిక భద్రతా మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం శుక్రవారం ఈ హత్యలు జరగగా.. బాలుడు పోలీసులకు సోమవారం తన నేరం గురించి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు ఈ ట్రిపుల్ హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు పిల్లలు మొబైల్ ఫోన్ విషయంలో గొడవపడుతుండగా.. తల్లిదండ్రులు ఆ ఫోన్ ను తీసుకుని వెళ్ళడంతో ఆ బాలుడు “చాలా నిరుత్సాహానికి గురయ్యాడు” అని ఇన్వెస్టిగేషన్ చీఫ్, రాబర్టో అఫోన్సో చెప్పారు. తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంతో కోపంతో తల్లిదండ్రులు, సోదరిని కాల్చి చంపినట్లు వెల్లడించాడు.

మునిసిపల్ పోలీసుగా విధులు నిర్వహిస్తున్న బాలుడి తండ్రి సర్వీస్ గన్‌ని తీసుకుని ముందుగా తండ్రి వీపు భాగంలో కాల్చినట్లు యువకుడు పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత మేడపైకి వెళ్లి తన 16 ఏళ్ల అక్క ముఖంపై కాల్చినట్లు.. కొన్ని గంటల తర్వాత ఇంటికి వచ్చిన తన తల్లిని అదే ఆయుధంతో కాల్చి కత్తితో పొడిచి హత్య చేసినట్లు వెల్లడించాడు. తండ్రి వయసు 57, తల్లికి 50 ఏళ్లు అని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

రాబర్టో అఫోన్సో బ్రెజిలియన్ నెట్‌వర్క్ టీవీ రికార్డ్‌తో మాట్లాడుతూ.. “ఇది ఒకరకమైన మానసిక వ్యాధి అని, నిరాశతో బాలుడు ఉన్నట్లు అని మనం అర్థం చేసుకోవాలని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ సంఘటన సమయంలో బాలుడు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడాడా అనే విషయంతో సహా.. హత్య విషయంలో మరొకరి ప్రమేయం ఉన్న అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శుక్రవారం నుండి సోమవారం తెల్లవారుజామున లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అతన్ని అదుపులోకి తీసుకునే వరకు ఆ ముగ్గురు మృత దేహాలతో కలిసి ఆ ఇంట్లోనే ఉన్నాడు. అంతేకాదు ఈ సమయంలో అతను జిమ్‌కి వెళ్ళేవాడు. బేకరీలో తినే ఆహారాన్ని కొనుగోలు చేశాడు. అఫోన్సో ఇదే విషయంపై మాట్లాడుతూ.. శనివారం కోపం మరింత అధికం కాగా నిర్జీవమై నేల మీద ఉన్న తన తల్లి శరీరంపై కత్తితో పొడిచాడు.

ప్రస్తుతం యువ నేరస్థుల కోసం బాల్య సదుపాయంలో నిర్బంధించబడి ఉన్నాడు బాలుడు. తాను చేసిన హత్యల గురించి పోలీసులకు చెప్పే సమయంలో చాలా శాంత స్వభావాన్ని ప్రదర్శించాడని పోలీసు అధికారి పేర్కొన్నాడు. బ్రెజిల్‌లో ప్రత్యేక చట్టపరమైన నిబంధనల ప్రకారం తక్కువ వయస్సు గల అనుమానితులకు నేరాలకు తగిన శిక్షలు ఉండవు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..