Kabul Blast: కాబుల్‌లో మరోసారి బాంబుల మోత​.. పాఠశాల సమీపంలో పేలుడు.. 40 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

|

May 08, 2021 | 9:02 PM

అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్​ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది0. కాబుల్‌లోని ఓ పాఠశాల సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40మంది అక్కడికక్కడే మృతి చెందారు.

Kabul Blast: కాబుల్‌లో మరోసారి బాంబుల మోత​.. పాఠశాల సమీపంలో పేలుడు.. 40 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Blasts Targeting Afghan School In Kabul
Follow us on

Blasts targeting Afghan school: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్​ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది0. కాబుల్‌లోని ఓ పాఠశాల సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40మంది అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయినవారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు అఫ్గాన్​ ప్రభుత్వం తెలిపింది. మరో 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు పేర్కొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి గులాం దస్తగిర్​ నాజరి తెలిపారు.

పేలుడు జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్సులు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని అఫ్గాన్ మంత్రి తారీఖ్​ అరియాన్​ తెలిపారు. అయితే, అంబులెన్సులను అడ్డుకుని ప్రజలు దాడులకు తెగబడ్డారని దీంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి గులాం దస్తగిర్​ నాజరి అన్నారు. వారిని సముదాయించి అంబులెన్సులు వెళ్లేలా చేశామన్నారు. కాగా, ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే ఇటీవల అదే ప్రాంతంలో షీతేస్​ మైనార్టీలపై దాడి చేసింది తామేనని ఇస్లామిక్​ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అఫ్గాన్​ నుంచి అమెరికా బలగాలు తమ దేశానికి పయనమైన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.

Read Also… కోవిడ్ రోగి అంత్యక్రియలకు 150 మంది హాజరు, 21 మంది మృతి, ఖండించిన అధికారులు