శ్రీలంకలో మరో పేలుడు
శ్రీలంకలో మరో పేలుడు సంభవించింది. ఆ దేశ రాజధాని కొలొంబోకు 40కి.మీల దూరంలో ఉన్న పుగోడాలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన భయానక దాడుల ఘటన తరువాత పోలీసులు నిర్విరామంగా తనిఖీలు చేస్తున్నారు. అయినా ఎక్కడో ఓ చోట పేలుడు సంభవిస్తూనే ఉంది. బుధవారం సినిమా థియేటర్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు ఓ బైక్లో బాంబు అమర్చారు. దాన్ని గ్రహించిన […]
శ్రీలంకలో మరో పేలుడు సంభవించింది. ఆ దేశ రాజధాని కొలొంబోకు 40కి.మీల దూరంలో ఉన్న పుగోడాలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన భయానక దాడుల ఘటన తరువాత పోలీసులు నిర్విరామంగా తనిఖీలు చేస్తున్నారు. అయినా ఎక్కడో ఓ చోట పేలుడు సంభవిస్తూనే ఉంది. బుధవారం సినిమా థియేటర్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు ఓ బైక్లో బాంబు అమర్చారు. దాన్ని గ్రహించిన పోలీసులు నిర్వీర్యం చేస్తుండగా అది పేలిన విషయం తెలిసిందే. కాగా శ్రీలంకలో జరిగిన భీకర పేలుళ్లలో మృతుల సంఖ్య 350కి చేరింది.