వియత్నాంలో బయటపడ్డ 9వ శతాబ్దపు పురాతన శివలింగం..!

వియత్నాంలో జరిపిన తవ్వకాల్లో 9వ శతాబ్దపు పురాతన శివలింగం బయటపడింది. అక్కడి చామ్‌ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరుపుతున్న పునరుద్ధరణ పనుల్లో ఈ శివ లింగం బయల్పడింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఇరు దేశాల మధ్య ‘నాగరికత సంబంధం’ విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేయొచ్చని అన్నారు. ”9వ శతాబ్ధానికి చెందిన ఇసుక రాతితో చేసిన ఏకశిలా శివలింగం బయటపడింది. మై సన్‌లోని […]

వియత్నాంలో బయటపడ్డ 9వ శతాబ్దపు పురాతన శివలింగం..!

Edited By:

Updated on: May 29, 2020 | 9:26 AM

వియత్నాంలో జరిపిన తవ్వకాల్లో 9వ శతాబ్దపు పురాతన శివలింగం బయటపడింది. అక్కడి చామ్‌ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరుపుతున్న పునరుద్ధరణ పనుల్లో ఈ శివ లింగం బయల్పడింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఇరు దేశాల మధ్య ‘నాగరికత సంబంధం’ విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేయొచ్చని అన్నారు.

”9వ శతాబ్ధానికి చెందిన ఇసుక రాతితో చేసిన ఏకశిలా శివలింగం బయటపడింది. మై సన్‌లోని చామ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీమ్‌కి అభినందనలు.  2011లో నేను అక్కడ పర్యటన చేశాను. ఆ ఙ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయి” అని జైశంకర్ ట్వీట్ చేశారు.

కాగా వియత్నంలోని క్వాంగ్‌ నామ్‌ పరిధిలో ఉన్న మై సన్‌ సిటీలో చామ్ టెంపుల్ ఉంది. దీన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. కింగ్ ఇంద్రవర్మన్ 2 కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆయన బౌద్ధమతాన్ని బాగా ప్రచారం చేయగా.. బౌద్ధంతో పాటు హిందూ మతం కూడా అప్పట్లో వియత్నాంలో ఉన్నట్లు ఈ శివలింగం ద్వారా తెలుస్తోందని సర్వే అధికారులు చెబుతున్నారు. ఇక ఈ దేవస్థానంలో ఇంతకుముందు కూడా ఆరు శివ లింగాలను గుర్తించామని, అయితే వాటన్నింటికంటే ఇది చాలా అద్భుతమైందని తెలిపారు. అంతేకాదు ఏకశిలతో ఈ శివ లింగం తయారైంది.

Read This Story Also: భారత్‌లో ‘మిడతల దాడి’.. సూర్య దర్శకుడు ముందే ఎలా ఊహించారంటే..!