భారత్‌లో ‘మిడతల దాడి’.. సూర్య దర్శకుడు ముందే ఎలా ఊహించారంటే..!

కరోనా సమయంలో భారత్‌ను ఇబ్బంది పెడుతోన్న మరో సమస్య ‘మిడతల దాడి’. పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఉత్తరాదిన వేల ఎకరాల పంటను నాశనం చేసిన ఈ మిడతల దండు, ఇప్పుడు దక్షిణాదికి కూడా వచ్చేస్తోంది. దీంతో అటు రైతులు, ఇటు అధికారుల్లో టెన్షన్ ఎక్కువవుతోంది. అయితే ఈ మిడతల దాడి గురించి సూర్య నటించిన కప్పాన్(తెలుగులో బందోబస్తు) చిత్రంలో దర్శకుడు కేవీ ఆనంద్‌ చూపించారు. గతేడాది వచ్చిన ఈ […]

భారత్‌లో 'మిడతల దాడి'.. సూర్య దర్శకుడు ముందే ఎలా ఊహించారంటే..!
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 2:13 PM

కరోనా సమయంలో భారత్‌ను ఇబ్బంది పెడుతోన్న మరో సమస్య ‘మిడతల దాడి’. పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఉత్తరాదిన వేల ఎకరాల పంటను నాశనం చేసిన ఈ మిడతల దండు, ఇప్పుడు దక్షిణాదికి కూడా వచ్చేస్తోంది. దీంతో అటు రైతులు, ఇటు అధికారుల్లో టెన్షన్ ఎక్కువవుతోంది. అయితే ఈ మిడతల దాడి గురించి సూర్య నటించిన కప్పాన్(తెలుగులో బందోబస్తు) చిత్రంలో దర్శకుడు కేవీ ఆనంద్‌ చూపించారు. గతేడాది వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు మిడతల ఎపిసోడ్‌తో ‘కప్పాన్’ చిత్రం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే ఈ మిడతల అటాక్‌ను ముందే ఊహించి సినిమాలో చూపడానికి రియల్ లైఫ్‌లో తాను చూసిన ఓ నిజ జీవిత సంఘటనే కారణమని ఆనంద్ తాజాగా చెప్పారు. 9 సంవత్సరాల క్రితం సూర్యతో తెరకెక్కించిన మాత్రాన్(తెలుగులో బ్రదర్స్) కోసం నేను మడగాస్కర్‌ వెళ్లాను. ఆ సమయంలో అక్కడ మిడతలు దాడి చేశాయి. దాని వలన నా కారును రోడ్డుపైనే కొన్ని గంటల పాటు ఆపాల్సి వచ్చింది. ఆ తరువాత అక్కడి స్థానికుల నుంచి మిడతల దాడి గురించి కాస్త సమాచారాన్ని తెలుసుకుని కాప్పాన్‌లో పెట్టాను అని అన్నారు. ఇక మిడతల సంఖ్య పెరగకుండా ఉండేందుకు కూడా ఆనంద్ కొన్ని సూచనలు చేశారు. మగ మిడతల్లో సంతానోత్పత్తికి అవసరమయ్యే వాటిని తొలగించడం ద్వారా వీటి సంఖ్యను తగ్గించొచ్చని, తద్వారా భారీ నష్టాన్ని ఆపొచ్చని ఆయన అన్నారు.

Read This Story Also: లాక్‌డౌన్‌ పిచ్చోళ్లను చేసింది.. రూమర్లపై సాక్షి ఘాటు కామెంట్లు..!

రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..