Nazi: 100 ఏళ్ళ నాటి నాజీ క్యాంపు హత్యలపై ఇప్పుడు విచారణ…

| Edited By: Anil kumar poka

Aug 04, 2021 | 2:24 PM

ఎప్పుడో వంద ఏళ్ళ నాటి నాజీ క్యాంపు హత్యలపై జర్మనీలో ఇక విచారణ ప్రారంభం కానుంది. వచ్చే సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో విచారణ మొదలవుతుందని ప్రాసిక్యూషన్ వర్గాలు తెలిపాయి. నిందితుల్లో ఓ మహిళ వయస్సు ఇప్పుడు 96 ఏళ్ళు కాగా..

Nazi: 100 ఏళ్ళ నాటి నాజీ క్యాంపు హత్యలపై ఇప్పుడు విచారణ...
100 Year Old Nazi Concentration Camp Guard Tobe Tried
Follow us on

ఎప్పుడో వంద ఏళ్ళ నాటి నాజీ క్యాంపు హత్యలపై జర్మనీలో ఇక విచారణ ప్రారంభం కానుంది. వచ్చే సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో విచారణ మొదలవుతుందని ప్రాసిక్యూషన్ వర్గాలు తెలిపాయి. నిందితుల్లో ఓ మహిళ వయస్సు ఇప్పుడు 96 ఏళ్ళు కాగా..మాజీ గార్డు వయస్సు సుమారు 100 ఏళ్ళు.. ఈ వృద్దురాలికి 10 వేలకు పైగా హత్యలతోను, వృద్దుడికి మూడున్నర వేలకు పైగా మర్దర్లతోను ప్రమేయం ఉందట. కానీ వంద ఏళ్ళు వచ్చినా ఈ వ్యక్తి దాదాపు రెండున్నర గంటల పాటు కోర్టులో నిలబడగలడని, అతని ఫిట్ నెస్..ఆరోగ్యం అలా ఉన్నాయని జర్మనీలోని నెరుప్పిన్ లో గల ప్రాసిక్యూషన్ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు అతని మెడికల్ ఫిట్ నెస్ తాలూకు రిపోర్టు గత ఫిబ్రవరిలోనే అందినట్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు. కోర్టులో ప్రతి రోజూ రెండున్నర గంటల పాటు విచారణ జరుగుతుందని వారు చెప్పారు. 1942-1945 మధ్య కాలంలో బెర్లిన్ లోని సాచెన్ హ్యూసన్ క్యాంప్ లో జరిగిన ఖైదీల హత్యల్లో ఈ మాజీ గార్డుకు ప్రత్యక్షంగా సంబంధం ఉందని వీరు పేర్కొన్నారు.

నాటి సోవియట్ యుద్ధ ఖైదీలపై కాల్పులు జరపడమేగాక.. జైక్లాన్-బీ అనే విష వాయువును ప్రయోగించి వారి దారుణ మరణానికి కారకుడయ్యాడన్న అభియోగాలు ఇతనిపై ఉన్నాయి. జర్మనీ ప్రైవసీ చట్టాల ప్రకారం ఈ నిందితుల పేర్లను వెల్లడించరాదట. ఫిర్యాదు చేసినవారిలో అనేక మంది వృద్దులయ్యారని, కానీ తమకు న్యాయం జరగాలని, నిందితులను శిక్షించాలని వీరంతా కోరుతున్నారని బాధితుల తరఫు లాయర్ థామస్ వాల్డర్ తెలిపారు. ముఖ్యంగా 1936-1945 మధ్య కాలంలో నాజీల క్యాంపుల్లోని 20 వేలమందికి పైగా ఖైదీల్లో చాలామంది ఆకలి బాధతోనో, వ్యాధుల కారణంగానో చనిపోగా..మిగిలినవారిని అధికారులు ఉరి తీసి గానీ, విష ప్రయోగం ద్వారా గానీ చంపేశారు. ఈ కేసుల్లో 96 ఏళ్ళ వృద్దురాలిపై వచ్చే నెలలో కోర్టు విచారణ జరగనుంది. స్టాఫ్ కాన్సెంట్రేషన్ క్యాంప్ కమాండెంట్ కు ఆ నాడు ఈమె సెక్రటరీగా పని చేసిందట. నాజీ క్యాంపు వర్గాలకు ఎవరు సహకరించినా ఇప్పుడు శిక్ష పడవలసిందేనని ప్రాసిక్యూటర్లు అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : పోయి పనిచూసుకోమన్న కేంద్రం..!మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..( వీడియో )

 ఛాయ్‌ అమ్మిన ఎమ్మెల్యే…ఒక్క ఛాయ్ 15 లక్షలు.. మీకు కావాలా..? ఎందుకో తెలుసా.?:MLA sold by Chai Video.

 వృద్ధురాలి భిక్షాటన.. కారణం నమ్మలేని నిజం.. బంధువు అని నమ్మినందుకు తగిన శాస్తి చేసాడు..:Kadapa video.

 తల్లిపాలే శిశువుకు అమృతం.. ముర్రుపాలే బిడ్డకు ఆరోగ్యం.. పిల్లలకు తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది..!:Motherfeed video.