Porsche cars: సముద్రం మధ్యలో పోర్షా కార్లు.. దాదాపు 1,100 పోర్షా కార్లు.. ఏం జరిగిందంటే..? (వీడియో)
అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో అజోర్స్ ద్వీపాల దగ్గర ఓ భారీ నౌకలో మంటలు చెలరేగాయి. పోర్చుగీసు నావికా దళాలు చేరుకుని నౌకలో 22 మంది సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ నౌకలో 3,965 విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ప్రస్తుతం "ఫెసిలిటీ ఏస్' నౌక
అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో అజోర్స్ ద్వీపాల దగ్గర ఓ భారీ నౌకలో మంటలు చెలరేగాయి. పోర్చుగీసు నావికా దళాలు చేరుకుని నౌకలో 22 మంది సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ నౌకలో 3,965 విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ప్రస్తుతం “ఫెసిలిటీ ఏస్’ నౌక ఓ ‘విగతజీవి’లా తేలుతూ ఉంది. మంటలు ఆర్పి నౌకను ఒడ్డుకు చేర్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జర్మనీలోని తయారైన పోర్షా, ఆడీ, లంబోర్గినీ, వోక్స్వ్యాగన్ కార్లను ఎండెన్ పోర్టు నుంచి అమెరికాలోని మెక్సికో పోర్టుకు తరలించేందుకు నౌక బయలుదేరగా.. మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 1,100 పోర్షా కార్లు నౌకలో ఉన్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి ల్యూక్ తెలిపారు. గతంలోనూ ఓసారి సముద్రంలో పోర్షా కార్లు మునిగిపోయాయి. గ్రాండే అమెరికా అనే భారీ నౌక 2019లో మంటలు అంటుకొని మునిగిపోయింది. దాంతోపాటే అందులో ఉన్న ఆడీ, పోర్షే కార్లూ మునిగిపోయాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

