70 మందితో వెళ్తున్న విమానం.. ఉన్నట్టుండి పొలాల్లో ల్యాండింగ్..
ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాలనుకున్న విమానం రన్వే వరకూ కూడా వెళ్లలేకపోయింది. దాంతో విమానాన్ని పొలాల్లో ల్యాండ్ చేశారు పైలట్లు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఉరల్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం 170 మంది ప్రయాణికులతో సోచి నుంచి ఓమ్స్కు వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా విమానాన్ని పొలాల్లో దించేశారు. ఉరల్ ఎయిర్లైన్స్కు చెందిన ఆ విమానం సెప్టెంబర్ 12న నోవోసిబిర్స్క్ ప్రాంతంలో ఉన్న కామెనేకి గ్రామం వద్ద ఉన్న పొలాల్లో ల్యాండ్ అయింది.
ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాలనుకున్న విమానం రన్వే వరకూ కూడా వెళ్లలేకపోయింది. దాంతో విమానాన్ని పొలాల్లో ల్యాండ్ చేశారు పైలట్లు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఉరల్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం 170 మంది ప్రయాణికులతో సోచి నుంచి ఓమ్స్కు వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా విమానాన్ని పొలాల్లో దించేశారు. ఉరల్ ఎయిర్లైన్స్కు చెందిన ఆ విమానం సెప్టెంబర్ 12న నోవోసిబిర్స్క్ ప్రాంతంలో ఉన్న కామెనేకి గ్రామం వద్ద ఉన్న పొలాల్లో ల్యాండ్ అయింది. ఎయిర్పోర్టులో దించేందుకు ప్రయత్నం చేసినా.. ఆ విమానం రన్వే వరకు వెళ్లలేకపోయింది. దీంతో అత్యవసరంగా ఆ విమానాన్ని .. పంట పొలాల్లో దించేశారు. ఎయిర్బస్ ఏ320 విమానం.. సోచి నుంచి ఓమ్కు వెళ్తోంది. మార్గమధ్యలో ఎమర్జెన్సీ సందేశం రావడంతో.. ఆ విమానాన్ని నోవోసిబిర్క్స్కు పంపే ప్రయత్నం చేశారు. కానీ విమానంలో హైడ్రాలిక్ లోపం తలెత్తడంతో నోవోసిబిర్స్క్కు 180 కిలోమీటర్ల దూరంలోని ఓ పొలంలో దించేశారు. విమానంలో 23 మంది చిన్నారులు కూడా ఉన్నారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ పామును చూసి మగాళ్లే వణికిపోయారు.. ఆ యువతిమాత్రం..
ఆపరేషన్ థియేటర్లో కత్తులు పట్టాల్సిన డాక్టర్లు.. కర్రలు పట్టారు
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

