Expensive Fish: కోటి విలువైన కోనేం చేపలు లభ్యం.! ఉప్పాడ సంద్రంలో అరుదైన ఘటన..
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో పండుగ వాతావరణం నెలకొంది. అమీనాబాద్ మినీ ఫిషింగ్ అర్బర్లో టన్నులు కొద్ది కోనేం చేపలు వలకు చిక్కాయి.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో పండుగ వాతావరణం నెలకొంది. అమీనాబాద్ మినీ ఫిషింగ్ అర్బర్లో టన్నులు కొద్ది కోనేం చేపలు వలకు చిక్కాయి. ఉప్పాడకు చెందిన వంకా సత్తిబాబు, ఉమ్మిడి అప్పారావులు వేసిన వలకు కోనేం చేపలు చిక్కడంతో రేవులో సందడి వాతావరణం ఏర్పడింది. ఒకే వలకు కోటి రూపాయలకుపైగా విలువైన కోనేం జాతికి చెందిన చేపలు లభ్యమయ్యాయి. మత్స్యజాతుల్లో ఎంతో ఖరీదైన ఈ జాతి చేపలు చిక్కాయి. ఒక్కో చేప అయిదు కిలోలకు పైగా ఉంది. వీటిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు మరో ఇద్దరు మత్సకారులు వెళ్లి మూడు బోట్లలో తీసుకు వచ్చారు. వీటిని ఒడ్డుకు తీసుకొచ్చి బహిరంగ వేలం నిర్వహించగా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారులు వీటిని కోటి ముప్పై లక్షలకు వేలంలో పాడుకున్నారు. ఈ చేపలు సుమారుగా 13 టన్నులు బరువును కలిగి ఉన్నాయని అంటున్నారు మత్య్సకారులు. దీంతో వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్లోకి వెళ్లనని తనయుడు మారం..
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె తీస్తే నోట్ల కట్టలు
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

