మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??

అమెరికాలోని ఒరెగాన్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. కొందరు రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారితో ప్లాట్‌ఫారంపై నిల్చుని ఉంది.

మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??

|

Updated on: Jan 13, 2023 | 9:41 AM

అమెరికాలోని ఒరెగాన్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. కొందరు రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారితో ప్లాట్‌ఫారంపై నిల్చుని ఉంది. పక్కనే బెంచ్‌మీద కొందరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారిలో ఓ అపరిచిత వ్యక్తి ఫ్లాట్‌ఫాంపై తన తల్లితోపాటు నిల్చుని ఉన్న మూడేళ్ల చిన్నారిని రైలు పట్టాలపైకి తోసేసింది. పాపం ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని ముల్ట్‌నోమా కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయం తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మూడేళ్ల బాలికను 32 ఏళ్ల బ్రియానా లేస్‌ వర్క్‌మెన్‌ అనే మహిళ తోసేసినట్లు వెబ్‌సైట్ పేర్కొంది. దీంతో బాలిక తలకు తీవ్ర గాయమై విలవిలలాడిందని తెలిపింది. ఈ ఘటనతో అక్కడే ఫ్లాట్‌ ఫాంపై ఉన్న మిగతా వ్యక్తులు వెంటనే స్పందించి…సదరు చిన్నారిని రక్షించారు. ఈ షాకింగ్‌ ఘటనతో సదరు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో బాహుబలి సిస్టరా ఏంది !! భారీ క్రేన్‌ను తేలికగా ఎత్తేసిన మహిళ !!

Veera Simha Reddy: బాలయ్య పాటకు.. గుడి పూజారీ క్రేజీ డ్యాన్సు !!

‘వారిసు’ థియేటర్లో ఏడ్చిన తమన్ !! ఎందుకంటే ??

Varasudu Pre Release Talk: అక్కడే అలా అయితే.. ఇక్కడ కష్టమే గా !!

Veera Simha Reddy: నెట్టింట లీకైన వీరసింహా రెడ్డి మూవీ !!

 

Follow us