డబ్బుల కోసం యూట్యూబర్లు ఇలా కూడా చేస్తారా ??
వరంగల్ పట్టణంలోని రంగంపేటలో దారుణహత్యకు గురైన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రాజమోహన్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్యను సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. ఇంట్లో మద్యం సేవించిన తర్వాత వరంగల్ వాసి ఈ హత్య చేసినట్లు తేలింది. సీసీ కెమెరాల సాయంతో హంతకుణ్ణి గుర్తించిన పోలీసులు..అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
హత్య చేసిన నిందితుడు యూట్యూబర్ గా గుర్తించారు. అప్పు ఇవ్వలేదన్న కోపంతో కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు చెప్పారు. మృతుడి ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లాడు నిందితుడు. ఈ నెల 4వ తేదీన కాకతీయ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ రాజామోహన్ దారుణ హత్యకు గురయ్యాడు. కాళ్లు, చేతులను తాళ్లు, గొలుసులతో కట్టేసి.. అతికిరాతకంగా హత్య చేశారు . ఆ తర్వాత మృతదేహాన్ని కారు వెనక భాగంలో పెట్టి.. రంగంపేటలోనే పార్క్ చేసి పారిపోవడం వరంగల్ ప్రజల్ని ఉలిక్కి పడేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bleeding Eye: కరోనా కంటే డేంజర్.. బ్లీడింగ్ ఐ వైరస్ !!
ఆలోచన అదిరిందిపో.. కుక్కల నుంచి రక్షణకు వినూత్న ప్రయోగం !!
జలుబు, దగ్గు, గొంతునొప్పికి ఇంటి చిట్కాలు
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

