చిరుతలనే పరుగులు పెట్టించిన ఎద్దు వీడియో వైరల్
సాధారణంగా అడవికి రారాజు సింహం అయితే.. పులులు, చిరుత పులులు డిప్యూటీలు అని చెప్పుకోవచ్చు. అవి కనిపిస్తే చాలు ఎంత పెద్ద జంతువైనా జడుసుకోవాల్సిందే. ఇక అడవిలో తప్పిపోయిన ఆవులు, ఎద్దులైతే వాటికి ఆహారంగా మారాల్సిందే. అలాంటిది రెండు చిరుతలను ఓ ఒంటరి ఎద్దు తరిమిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్స్ను షాక్కి గురి చేస్తుంది. ఈ వీడియోలో రెండు చిరుతల నుంచి తనను తాను ఎంతో తెలివిగా కాపాడుకోడానికి ఎవరూ ఊహించని పని చేసింది ఆఎద్దు. ఈ వీడియో ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో, అటవీప్రాంతంలో ఓ ఎద్దు ఓ రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తోంది. దారిలో దానికి రెండు చిరుతపులులు కనిపించాయి. వాటిని చూడగానే ఎద్దుకు కాస్త కంగారు పుట్టినా.. అది ఏమాత్రం పైకి కనబడనీయకుండా ముందుకు నడిచింది. చిరుతలకు దగ్గరగా వచ్చేటప్పటికి వేగం పెంచింది. వేగంగా అడుగులేసుకుంటూ వస్తున్న ఆ ఎద్దును చూడగానే ఈ చిరుతలకు కంగారు పుట్టింది. అయినా ఎద్దును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా దాని ముందుకు వచ్చాయి. చిరుతల తీరులో భయాన్ని గమనించిన ఎద్దు వాటిని మరింత భయపెడుతూ తన కొమ్ములతో వాటిని పొడిచేందుకు వెళ్లింది. విషయం అర్ధమైన చిరుతలు తోకముడుచుకొని పరుగందుకున్నాయి. భయంతో దట్టమైన అడవిలోకి పారిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరుతలు ఓ ఎద్దుకు భయపడటమా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఒక యూజర్.. అడవిలో చిరుత ఉనికి కూడా ఎద్దు వల్ల ప్రమాదంలో ఉంది అంటూ పోస్టు పెట్టాడు. . “చిరుత వేరే మూడ్లో ఉందనుకుంటా, లేకుంటే అదే ఆ ఎద్దు చివరి రోజు అయ్యేది” అని మరొకరు రాశారు.
మరిన్ని వీడియోల కోసం :
పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో
కరెంట్ పోల్ పైన పక్షి గూళ్లు .. ఆఫ్రికాలో అద్భుతం వీడియో
బ్యాచ్ లర్స్.. ఇది మీ కోసమే వీడియో
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

