కారును ఢీకొట్టిన రాపిడో డ్రైవర్.. తర్వాత ఏమైందంటే?వీడియో
దేశంలో తరుచూ ఏదో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. రోజురోజుకు వాహనాల రద్దీ పేరగడం, మితి మీరిన వేగంతో ప్రయాణించడమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రయాణీకులు మరణిస్తున్నారు. మరెంతో మంది కాళ్లు, చేతులు పోగొట్టుకుని వికలాంగులుగా మారుతున్నారు. సంతోషంగా గమ్యస్థానాలకు చేరుకోవల్సిన వారు డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం కారణంగా మార్గం మధ్యలోనే ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ ప్రమాదం జరిగింది. రోడ్డు మలుపులోంచి వచ్చిన కారును బైక్పై వెళ్తున్న రాపిడో డ్రైవర్ ఢీకొట్టాడు. ప్రమాదం ధాటికి అతడు గాలిలోకి ఎగిరి పల్టీలు కొట్టి కిందపడ్డాడు. అక్కడున్న వారు వెంటనే స్పందించారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఫిబ్రవరి 13న ఇందిరా నగర్లో సెక్టార్ 13లోని మలుపు నుంచి ఒక కారు వచ్చింది. బైక్పై వేగంగా వెళ్తున్న రాపిడో డ్రైవర్ అభిజిత్ శ్రీవాస్త ఆ కారును బలంగా ఢీకొట్టాడు. దీంతో అతడు గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టి కిందపడ్డాడు. కాగా, ఈ ప్రమాదాన్ని గమనించిన అక్కడున్న వారు వెంటనే స్పందించారు. రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడిన అభిజిత్ను వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరిన్ని వీడియోల కోసం :
కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గౌడన్న.. తొర్రలోకి చూసి షాక్ వీడియో
తన భార్యకు మెసేజ్లు పంపుతున్న వ్యక్తి చెయ్యి నరికి..చివరికి వీడియో
పిల్లలు పుట్టరని తెలిసినా పెళ్లి చేసుకున్నాడు.. ఎంతమంచివాడో అనుకుంది..చివరికి..
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

