కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గౌడన్న.. తొర్రలోకి చూసి షాక్ వీడియో
పొట్ట కూటి కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తాటి చెట్లు ఎక్కి కల్లు గీస్తూ జీవించే గీత కార్మికుల బతుకులు ప్రమాదకరం. రియల్ ఎస్టేట్ వ్యాపారం, మొగి పురుగు దెబ్బకు తాటి, ఈత వనాలు అంతరించిపోతున్నాయి. ఊరూరా, వాడవాడలా వెలసిన బెల్టుషాపుల ధాటికి కల్లుకు గిరాకీ తగ్గిపోయింది. అయినా కూడా తరతరాలకు కూడు పెట్టిన తమ కుల వృత్తిని వదిలేందుకు గౌడన్నలకు మనసు ఒప్పదు. ఆ వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.కుల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న కొందరు పేద గౌడన్నలు ఎండిన తాటి, ఈత వనాలతో కల్లు రాక బతుకులీడుస్తున్నారు. చాలీచాలని ఆదాయంతో కొందరికి రెండు పూటలా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక వారు చేసే రిస్క్ గురించి ఎంత తక్కువ చెబితే అంత బెటర్
. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఓ గీత కార్మికుడు కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. అయితే పైన ఓ తాటి మట్ట తొర్రలో ఊహించని విధంగా ఓ పాము కనిపించింది. అయితే గీత కార్మికుడు ఆ పామును చూసి.. తత్తరపాటుకు గురికాలేదు. ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ధైర్యసాహసాలతో వ్యవహరించాడు. జాగ్రత్తగా ఆ పామును అక్కడి నుంచి తరిమేశాడు. కాగా తాటి చెట్లు పాములను ఆకర్షిస్తాయని కొందరు అంటున్నారు. ఎందుకంటే తాటి చెట్టు నుంచి వచ్చే సువాసనతో పాటు.. తాటిచెట్ల మీద తినడానికి పాములకు ఎలుకలు దొరుకుతాయని అంటున్నారు. కాగా గీత కార్మికుడి కంట పడిన ఆ పాము కట్ల పాము అని.. అది చాలా ప్రమాదకరమైనది అని కొందరు అంటుంటే.. అది విషపూరితం కాదు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా గౌడ సోదరులు చాలా ధైర్యవంతులని.. కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది సూచిస్తున్నారు.
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

