అయ్య బాబోయ్.. భారీ కొండ చిలువ..
దట్టమైన అటవీ ప్రాంతం లో ఉండాల్సిన కొండ చిలువ.. జనవాసం లోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రెండవ బైపాస్ రోడ్లోని దోబీ ఘాట్ వద్ద కొండచిలువ కనబడింది. మూలవాగు నుంచి అది రోడ్డు వైపు వస్తుండగా గుర్తించిన స్థానికులు.. ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో దానిని చూసేందుకు ప్రజలు, వాహనదారులు పెద్ద ఎత్తున గూమిగూడారు.
ఇక.. ఆరు అడుగులకు పైగా పొడవున్న ఆ భారీ కొండచిలువను చూసి జనం షాక్ అయ్యారు.భారీగా ఉండటంతో అది రోడ్డుమీద వేగంగా పాకలేకపోయింది. దీంతో.. అక్కడికి చేరిన యువకులు తమ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఒకేసారి రోడ్డుపై పెద్ధసంఖ్యలో జనం కూడటంతో పోలీసులు రంగంలోకి దిగి.. వారిని అక్కడి నుంచి పంపేశారు. తర్వాత అటవీ శాఖ అధికారులు ఆ కొండచిలువను మెల్లగా మూలవాగులోకి పంపే ప్రయత్నం చేశారు. దీంతో.. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడిరోడ్డుపై రౌడీయిజం.. అదే రోడ్డుపై పోలీసుల ట్రీట్ మెంట్
హైవేపై కుప్పకూలిన హెలికాప్టర్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
ఏ భాష మెసేజైనా మీ భాషలో చదువుకోవచ్చు.. వాట్సాప్లో మరో అద్భుత ఫీచర్
కొడుకు అలిగాడని అప్పు చేసి బైక్ కొనిస్తే.. రెండు రోజులకే యాక్సిడెంట్లో మృతి
ఆ కారుకు తరచుగా రిపేర్లు.. యజమానికి రూ.కోటి ఇవ్వాలన్న కన్జ్యూమర్ కోర్టు
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

