AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూగర్భంలో రెండంతస్తుల మేడ !! ఒక్కడే పన్నెండేళ్లు కష్టపడి నిర్మించిన వైనం

భూగర్భంలో రెండంతస్తుల మేడ !! ఒక్కడే పన్నెండేళ్లు కష్టపడి నిర్మించిన వైనం

Phani CH
|

Updated on: Sep 02, 2023 | 9:54 AM

Share

ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి భూగర్భంలో ఇల్లు నిర్మించి ఔరా అనిపించాడు. హర్దోయీకి చెందిన ఇర్ఫాన్‌ అలియాస్‌ పప్పుబాబా అనే వ్యక్తి తానొక్కడే పన్నెండేళ్లు కష్టపడి భూగర్భంలో రెండంతస్తుల మేడ కట్టాడు. పైకి బంకర్‌లా కనిపించే ఈ ఇంటిని తన కుటుంబానికి జీవనాధారమైన పొలంలోని మట్టితో నిర్మించాడు. 2010లో ఇర్ఫాన్‌ తండ్రి చనిపోవడంతో అతనికి కష్టాలు మొదలయ్యాయి. కొన్నాళ్లు ఢిల్లీలో పనిచేసాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి భూగర్భంలో ఇల్లు నిర్మించి ఔరా అనిపించాడు. హర్దోయీకి చెందిన ఇర్ఫాన్‌ అలియాస్‌ పప్పుబాబా అనే వ్యక్తి తానొక్కడే పన్నెండేళ్లు కష్టపడి భూగర్భంలో రెండంతస్తుల మేడ కట్టాడు. పైకి బంకర్‌లా కనిపించే ఈ ఇంటిని తన కుటుంబానికి జీవనాధారమైన పొలంలోని మట్టితో నిర్మించాడు. 2010లో ఇర్ఫాన్‌ తండ్రి చనిపోవడంతో అతనికి కష్టాలు మొదలయ్యాయి. కొన్నాళ్లు ఢిల్లీలో పనిచేసాడు. అ తర్వాత గ్రామానికి తిరిగి వచ్చి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. దాంతో తీవ్ర నిరాశకు గురైన ఇర్ఫాన్‌ మళ్లీ గ్రామం వదిలి వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ స్వగ్రామానికి వచ్చిన అతను ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. దాంతో తానొక్కడే 12 సంవత్సరాలు కష్టపడి, భూగర్భంలో ఇంటిని నిర్మించాడు. 2011లో ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన ఇర్ఫాన్‌ ఖుర్పా సాయంతో పాతకాలంలో మాదిరిగా అండాకారంలో ఇంటిగోడలను నిర్మించాడు. అలా పన్నెండేళ్లు ఇంటి నిర్మాణంలో మునిగిపోయిన ఇర్ఫాన్‌ కేవలం భోజనానికి మాత్రమే కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లేవాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెయిల్స్‌ స్టిక్కర్స్‌ తో కోట్లు సంపాదిస్తున్న మహిళ !!

విమానం రెక్కలపై డాన్స్‌ !! వీడియో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌

ముద్దుపెట్టేటప్పుడు జాగ్రత్త.. లేదంటే జరిగేది ఇదే !!

ఇంటర్నెట్ డేటా లేకున్నా.. ఎంచక్కా TV, OTT ప్రసారాలు చూడొచ్చు !!

అక్కడ జీవితకాలం 11 ఏళ్లు తగ్గిపోతుంది !! అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ వాస్తవాలు