Tourist Places In Goa: గోవాలో ఈ ప్లేస్ను చూశారా..! చెన్నై ఎక్స్ ప్రెస్ లో ఆ సీన్ తీసింది ఇక్కడే..!
పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి జాలువారుతున్న నీళ్లు.. అచ్చం పాలలా కనిపిస్తాయి. దాదాపు 310 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు అక్కడ జాలువారుతుంటాయి.
పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి జాలువారుతున్న నీళ్లు.. అచ్చం పాలలా కనిపిస్తాయి. దాదాపు 310 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు అక్కడ జాలువారుతుంటాయి. నురగలు కక్కుకుంటూ జలజలా జారుతూ పారే నీటిని చూస్తూ మైమరిచిపోవాల్సిందే. గోవాలో ఉంది ఈ అద్భుత దూత్సాగర్ జలపాతం. వర్షాకాలంలో ఇది మరింత అద్భుతంగా కనువిందు చేస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రమేష్ పాండే వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్గా మారిపోయింది. గోవా, కర్ణాటక సరిహద్దు మన్ డోవి నది పైన ఉంది ఈ దూద్ సాగర్ జలపాతం. ఈ జలపాతానికి చేరుకోవాలంటే గోవా రాజధాని పనాజి నుంచి 60 కిలోమీటర్ల ప్రయాణించాలి. ఇక ఈ జలపాతం పారుతున్న కొండల మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ ఉంటుంది. ట్రెయిన్ లో ప్రయాణిస్తూ దూద్ సాగర్ వాటర్ఫాల్ను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. షారుఖ్, దీపికా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఇక్కడే ఓ సీన్ ఉంటుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

