మాంసం వినియోగంలో ఆ దేశం టాప్.. భారత్ చాలా వెనుక
ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య మాంసం వినియోగంలో భారీ వ్యత్యాసం కనిపించింది. మాంసం ఎక్కువగా తినే దేశాల్లో అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచాయి. ఈ దేశాల్లో ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున 110 కిలోలకు పైగా మాంసాన్ని తింటున్న ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ తెలిపింది. మంగోలియా, స్పెయిన్, ఇజ్రాయెల్లో కూడా తలసరి మాంసం వినియోగం 100 కిలోల కంటే ఎక్కువగా ఉంది.
ధనిక దేశాలు కావడం, స్థానిక వంటకాల్లో మాంసానికి ప్రాధాన్యత ఉండటం వంటివి ప్రధాన కారణాలు. ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలవి. మాంసం ధరలు అధికంగా ఉండటం, సాంస్కృతిక కారణాల వల్ల వినియోగం చాలా తక్కువ. 2022 సంవత్సరానికి భారత్ డేటా అందుబాటులో లేనప్పటికీ, గత గణాంకాలను పరిశీలిస్తే ఇక్కడ మాంసం వినియోగం ప్రపంచంలోనే అతి తక్కువ. కాంగో, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. అలాగే యుద్ధం, సరఫరా సమస్యలతో సతమతమవుతున్న సిరియా, యెమెన్, ఉత్తర కొరియాలో కూడా ప్రజలు మాంసానికి దూరంగా ఉంటున్నారు. అధిక మాంసం వినియోగం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులను అదుపులో ఉంచాలంటే పశ్చిమ దేశాలు తమ మాంసం వినియోగాన్ని 90 శాతం తగ్గించుకోవాలని ‘నేచర్’ పత్రికలోని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. మాంసం తగ్గించడం ద్వారా ఏర్పడే పోషకాహార లోటును బీన్స్, ఇతర పప్పుధాన్యాలతో భర్తీ చేయాలని సూచించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ కొండముచ్చు ఆసనాలు చూస్తే.. యోగా గురువులు కూడా బలాదూర్
మలాశయం ద్వారా ఆక్సిజన్.. జపనీస్ శాస్త్రవేత్తల కొత్త టెక్నిక్ !!
వింటర్లో వింటేజీ రైలు జర్నీ.. ఈ మార్గంలో ప్రయాణం.. అస్సలు మిస్ కావొద్దు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

