మలాశయం ద్వారా ఆక్సిజన్.. జపనీస్ శాస్త్రవేత్తల కొత్త టెక్నిక్ !!
సృష్టిలోని ఏ జీవి అయినా ముక్కుద్వారా శ్వాస తీసుకుంటుందని మనందరికీ తెలుసు. కొన్ని జీవులు మలాశయం ద్వారా కూడా శ్వాస తీసుకుంటాయట. దీనిని ఆసరాగా చేసుకొని జపనీస్ శాస్త్రవేత్తలు ఓ కొత్త టెక్నిక్ కనిపెట్టారు. మానవులు కూడా ముక్కు నోటినుంచే కాకుండా మలాశయంద్వారా కూడా శ్వాసతీసుకోవచ్చని చెబుతున్నారు. బట్ బ్రీథింగ్ పేరుతో జపనీస్ శాస్త్రవేత్తలు ఈ చిట్కాను అభివృద్ధి చేశారు.
ఈ విధానంలో మలాశయం నుంచి ఆక్సిజన్ శరీరంలోకి చేరుతుంది. ఈ విధానంలో ఆక్సిజన్తో కూడిన ద్రవ పదార్థాన్ని రోగి శరీరంలోకి మలాశయం ద్వారా పంపిస్తారట. అనంతరం ఆ ద్రవపదార్ధంలోని ఆక్సిజన్ ప్రేగుల ద్వారా రక్తంలోకి చేరుతుందట. ఈ పద్ధతి సురక్షితమైనదేనని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిందట. ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడే రోగులకు ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందట. చేపలు, కొన్ని రకాల తాబేళ్లు, వానపాములు తమ మలాశయం ద్వారా శ్వాస తీసుకుంటాయట. వీటిని ప్రేరణగా తీసుకుని ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. పరిశోధకుడు డాక్టర్ టముహికో టకెబె ఈ టెక్నిక్పై స్పందిస్తూ… కొవిడ్ మహమ్మారి సమయంలో చాలా మంది రోగులు వెంటిలేటర్ల కొరత వల్ల మరణించారని, అలాంటి పరిస్థితుల్లో రోగులకు ఆక్సిజన్ను అందించేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ బ్యాకప్ శ్వాస వ్యవస్థ విజయవంతమైతే, రాబోయే కాలంలో ఇది వైద్య విజ్ఞాన శాస్త్ర దిశను మార్చవచ్చని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింటర్లో వింటేజీ రైలు జర్నీ.. ఈ మార్గంలో ప్రయాణం.. అస్సలు మిస్ కావొద్దు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్కు వచ్చి.. ఆర్టిస్ట్కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

