Kurnool: వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
కర్నూలు జిల్లాలో వింత ఆచారం అమలులో ఉంది. ఇక్కడ గ్రామస్తులంతా కలిసి కులమతాలకతీతంగా అందరూ ఒక చోట చేరి సహపంక్తి భోజనం చేయడం అక్కడి సంప్రదాయంగా కొనసాగుతోంది. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఆ గ్రామం ఐక్యతను చాటుతోంది. ఏటా కార్తీక మాసం ముగిసిన అనంతరం వచ్చే సోమవారం రోజు గ్రామస్తులంతా కలిసి సహపంక్తి భోజనం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని, కరువు కాటకాలు ఉండవని వారి విశ్వాసం.
కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం నారాయణపురం గ్రామంలో ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. పూర్వం ఈ గ్రామం కరువు కాటకాలతో అల్లాడిపోతున్న సమయంలో గ్రామస్తులంతా కలిసి గ్రామదేవత గర్జప్ప స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి, ప్రతి ఒక్కరూ తమ ఇంటినుంచి అన్నం వండుకొని తీసుకొచ్చి పెద్ద రాశిలా పోసి స్వామివారికి నైవేద్యం సమర్పించి, ఆ నైవేద్యాన్ని గ్రామస్తులంతా కలిసి సహపంక్తి భోజనంగా చేసేవారు. అప్పటినుంచి ఆ గ్రామంలో కరువు కాటకాలు లేవని స్థానికులు చెబుతారు. అప్పటినుంచి ఈ ఆచారం తాము తప్పక పాటిస్తామని తెలిపారు. ఏటా కార్తీక మాసం తర్వాత వచ్చే మొదటి సోమవారం గ్రామంలోని ప్రతి ఇంటినుంచి ఎంతో నిష్టతో ఇంటిల్లిపాదికీ సరిపడా భోజనం సిద్ధం చేసుకొని గర్జప్పస్వామి ఆలయానికి తీసుకొస్తారు. అక్కడ గ్రామపెద్దలు, పూజారులు.. ఈ అన్నప్రసాదాన్ని ఆలయంలో స్వామివారి ముందు పెద్ద రాశిగా పోసి నివేదన చేస్తారు. అనంతరం ఆలయం ఎదుట అందరూ కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. కుల,మత, వయో భేదం లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

