Viral: సముద్రం అడుగున రామచంద్రుడు.! విశాఖ బీచ్ వద్ద అబ్బురపరిచిన దృశ్యం.
జనవరి 22 సోమవారం యావత్ భారతదేశం మనసు, చూపు అయోధ్యవైపే ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఊరూవాడా రామనామకీర్తనలతో మార్మోగింది. పలువురు తమదైనశైలిలో రామునిపై భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో విశాఖకు చెందిన స్కూబా డైవర్లు అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సముద్ర గర్భంలో రాముని చిత్రపటాన్ని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకున్నారు. సోమవారం రిషికొండ బీచ్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
జనవరి 22 సోమవారం యావత్ భారతదేశం మనసు, చూపు అయోధ్యవైపే ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఊరూవాడా రామనామకీర్తనలతో మార్మోగింది. పలువురు తమదైనశైలిలో రామునిపై భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో విశాఖకు చెందిన స్కూబా డైవర్లు అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సముద్ర గర్భంలో రాముని చిత్రపటాన్ని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకున్నారు. సోమవారం రిషికొండ బీచ్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రంలో 22 అడుగుల లోతున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాముడిపై హిందువులకు ఉండే బలమైన విశ్వాసానికి, సంప్రదాయానికి ఈ కార్యక్రమం చిహ్నమని స్కూబా డైవర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు స్కూబా డైవర్లు పాలుపంచుకున్నట్టు లివిన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ ఫ్రాంటియర్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ నాయుడు తెలిపారు. ఫోమ్ బోర్డుపై ఏర్పాటు చేసిన రాముడి చిత్రంపటంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, చిత్రపటంపై పూల రేకులు, ఆక్సిజన్ బబుల్స్ కురిపించామని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

