Viral: సముద్రం అడుగున రామచంద్రుడు.! విశాఖ బీచ్ వద్ద అబ్బురపరిచిన దృశ్యం.
జనవరి 22 సోమవారం యావత్ భారతదేశం మనసు, చూపు అయోధ్యవైపే ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఊరూవాడా రామనామకీర్తనలతో మార్మోగింది. పలువురు తమదైనశైలిలో రామునిపై భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో విశాఖకు చెందిన స్కూబా డైవర్లు అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సముద్ర గర్భంలో రాముని చిత్రపటాన్ని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకున్నారు. సోమవారం రిషికొండ బీచ్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
జనవరి 22 సోమవారం యావత్ భారతదేశం మనసు, చూపు అయోధ్యవైపే ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఊరూవాడా రామనామకీర్తనలతో మార్మోగింది. పలువురు తమదైనశైలిలో రామునిపై భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో విశాఖకు చెందిన స్కూబా డైవర్లు అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సముద్ర గర్భంలో రాముని చిత్రపటాన్ని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకున్నారు. సోమవారం రిషికొండ బీచ్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రంలో 22 అడుగుల లోతున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాముడిపై హిందువులకు ఉండే బలమైన విశ్వాసానికి, సంప్రదాయానికి ఈ కార్యక్రమం చిహ్నమని స్కూబా డైవర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు స్కూబా డైవర్లు పాలుపంచుకున్నట్టు లివిన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ ఫ్రాంటియర్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ నాయుడు తెలిపారు. ఫోమ్ బోర్డుపై ఏర్పాటు చేసిన రాముడి చిత్రంపటంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, చిత్రపటంపై పూల రేకులు, ఆక్సిజన్ బబుల్స్ కురిపించామని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

