Viral: సముద్రం అడుగున రామచంద్రుడు.! విశాఖ బీచ్ వద్ద అబ్బురపరిచిన దృశ్యం.
జనవరి 22 సోమవారం యావత్ భారతదేశం మనసు, చూపు అయోధ్యవైపే ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఊరూవాడా రామనామకీర్తనలతో మార్మోగింది. పలువురు తమదైనశైలిలో రామునిపై భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో విశాఖకు చెందిన స్కూబా డైవర్లు అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సముద్ర గర్భంలో రాముని చిత్రపటాన్ని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకున్నారు. సోమవారం రిషికొండ బీచ్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
జనవరి 22 సోమవారం యావత్ భారతదేశం మనసు, చూపు అయోధ్యవైపే ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఊరూవాడా రామనామకీర్తనలతో మార్మోగింది. పలువురు తమదైనశైలిలో రామునిపై భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో విశాఖకు చెందిన స్కూబా డైవర్లు అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సముద్ర గర్భంలో రాముని చిత్రపటాన్ని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకున్నారు. సోమవారం రిషికొండ బీచ్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రంలో 22 అడుగుల లోతున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాముడిపై హిందువులకు ఉండే బలమైన విశ్వాసానికి, సంప్రదాయానికి ఈ కార్యక్రమం చిహ్నమని స్కూబా డైవర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు స్కూబా డైవర్లు పాలుపంచుకున్నట్టు లివిన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ ఫ్రాంటియర్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ నాయుడు తెలిపారు. ఫోమ్ బోర్డుపై ఏర్పాటు చేసిన రాముడి చిత్రంపటంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, చిత్రపటంపై పూల రేకులు, ఆక్సిజన్ బబుల్స్ కురిపించామని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

